రాహుల్ గాంధీకి పెళ్లికాలేదు... 'అమ్మాయిలూ వంగకండి'

Update: 2021-03-30 09:47 GMT
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొందరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు చేసే కొన్ని వ్యాఖ్యలు  కాంట్రవర్శియల్ అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేరళకు చెందిన మాజీ స్వతంత్ర ఎంపీ జాయ్స్ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీపీఎం అభ్యర్థి, మంత్రి ఎంఎం మణికి మద్దుతుగా నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన.. రాహుల్ గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనితో అయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల మండిపడుతున్నారు.

మాజీ ఎంపీ జాయిస్ జార్జ్ చేసి ప్రకటనపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్లో ఫిర్యాదు చేసింది.  సీపీఎం అభ్యర్థి, మంత్రి ఎంఎం మణికి మద్దుతుగా నిర్వహించిన సభలో పాల్గొన్నమాజీ స్వతంత్ర ఎంపీ జాయ్స్ జార్జ్ రాహుల్ గాంధీ పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆయన ముందు వంగకూడదని అన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ అమ్మాయిల కాలేజీలకే వెళుతుంటారు. అక్కడికి పోయి వంగాల్సిందిగా అమ్మాయిలకు చెబుతుంటారు. అమ్మాయిలూ.. దయచేసి రాహుల్ ముందు వంగకండి. ఆయన ముందు అసలు నిలబడకండి. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు అంటూ ఇడుక్కీ మాజీ ఎంపీ అయిన ఆయన వ్యాఖ్యానించారు. జార్జ్ మాటలకు పక్కనే ఉన్న మంత్రి ఎంఎం మణి నవ్వుతూ కనిపించారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో జార్జ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.  

రాహుల్ గాంధీ లేటెస్ట్‌గా కొచ్చిలో సెయింట్ థెరెసా కాలేజీకి వెళ్లారు అక్కడ విద్యార్థినిలకు ఐకిడోలో శిక్షణ ఇచ్చారు రాహుల్, ఐకిడోలో నిపుణుడైన రాహుల్, విద్యార్థులు తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే దానిపై ప్రాక్టికల్‌గా శిక్షణ ఇచ్చారు. ఐకిడో భంగిమల్లో కనిపించి విద్యార్థినులను, దృష్టిలో ఉంచుకొని జార్జ్ చెత్త వ్యాఖ్యలు చేసినట్లుగా కాంగ్రెస్ అభిప్రాయ పడుతుంది. జాయిస్ చేసిన కామెంట్స్‌ను కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల తీవ్రంగా ఖండించారు. రాహుల్‌నే కాదు మహిళలను కూడా జాయిస్ కించపరిచారని మండిపడ్డారు. కేరళ ముఖ్యమంత్రి పినరియి విజయన్ కూడా జాయిస్ వ్యాఖ్యలను ఖండించారు.
Tags:    

Similar News