కరోనా మమ్మల్ని ఏంచేయలేకపోయింది!!

Update: 2020-07-03 07:50 GMT
కరోనా వైరస్ ..కరోనా వైరస్ ..గత 7 నెలలుగా ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి కారణంగా భయంతో వణికిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి భారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే కోటికి దాటిపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా మహమ్మారిని అరికట్టలేకపోతున్నారు. దీనితో రోజురోజుకి అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. అయితే , ఈ సమయంలో ఈ కరోనా వైరస్ ఉత్తర కొరియాను ఏమీ చేయలేకపోయిందని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అభిప్రాయపడ్డారు.

మహమ్మారి విషయంలో ఉత్తర కొరియా ప్రజల పోరాటం అద్వితీయమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తెలిపాడు. ఆ దేశ అధికారిక న్యూస్ ఏజన్సీ కేసీఎన్ఏ, ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న వేళ, తన దేశాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు. వర్కర్స్ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న ఆయన, వైరస్ పైనా, ఆరు నెలల నుంచి సరిహద్దులను మూసివేసిన విషయంపైనా చర్చించారు.

అయితే, జాతి భద్రతను దృష్టిలో ఉంచుకుని వేలాదిమందిని ఐసోలేషన్ లో ఉంచామన్నారు. పార్టీ జనరల్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతోనే కరొనను జయించగలిగామన్నారు. జాతి యావత్తూ, స్వచ్చందంగా మహమ్మారిపై పోరాడిందని దేశ ప్రజలను ఆయన అభినందించారు. అలాగే ఇంకా ఇప్పటికీ ఆ పరిస్థితి పూర్తిగా మారలేదని, గరిష్ఠ అప్రమత్తత అవసరమని కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యానించారని పేర్కొంది.
Tags:    

Similar News