లార్డ్స్ లాంగ్ రూమ్ లో కోహ్లీ-రూట్ ఫైటింగ్?

Update: 2021-08-25 16:30 GMT
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు  జరిగిన ఓ సంచలన ఘటన తాజాగా వెలుగు చూసింది. దీని ప్రభావం మూడో టెస్టుపై మరింత వేడి రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వివాదం ఇరు జట్ల క్రికెటర్లు, కెప్టెన్ల పనితీరు, వారి వ్యూహాలను ప్రభావితం చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంగ్లండ్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.  మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ కోహ్లీ, ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ మధ్య వాడివేడి వాగ్వాదం నడిచినట్లు సమాచారం.  లార్డ్స్ పెవిలియన్ లాంగ్ రూమ్ వేదికగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

ఈ వాగ్వాదంలో ఇరు జట్ల ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగత దాడుల వరకూ వెళ్లినట్లు బ్రిటీష్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. కోహ్లీ , రూట్ అయితే ఏకంగా బాహాబాహీకి దిగినట్లు సమాచారం.

రెండోటెస్టులో అండర్సన్ ను బుమ్రా టార్గెట్ చేయడం .. బాడీకి బంతులు విసరడం వివాదానికి ఆజ్యం పోసింది. దీన్ని మనసులో పెట్టుకొని అండర్సన్ ఔటౌన అనంతరం బుమ్రాను దూషించాడు. దీంతో ఇరు జట్ల మధ్య చిన్నపాటి యుద్ధం మొదలైంది. ఈ క్రమంలోనే లాడ్స్ రూమ్ లో కోహ్లీ, రూట్ మధ్య వివాదం సాగినట్లు తెలుస్తోంది. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News