ఖుష్బూను టచ్ చేశాడు..చెంప పగిలింది..వైరల్ వీడియో

Update: 2019-04-11 10:04 GMT
ప్రముఖ తమిళ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖుష్బూ తమిళనాడులోనే కాదు.. తనకు ఫాలోయింగ్ ఉన్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళలోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది.

అయితే కొద్దిరోజుల క్రితం ఖుష్బూ ఎన్నికల ప్రచారంలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే ఆమె బెంగళూరు లో కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 10న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిజ్వాన్ కు మద్దతుగా రిజ్వాన్ ఇంటి నుంచి కారు ఎక్కేందుకు వెళుతుండగా ఆమెను కార్యకర్తలు చుట్టుముట్టారు. ఒక్కసారిగా అందరూ ఖుష్బూను చుట్టుముట్టడంతో ఎవరో ఆమెను అసభ్యకర రీతిలో టచ్ చేశారు. దీంతో వెంటనే సీరియస్ అయిన ఖుష్బూ వెనక్కి తెరిగి ఓ వ్యక్తి చెంప పగులకొట్టింది.

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంపులో ఎవరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారో తెలియదు కానీ.. ఖుష్బూ మాత్రం ఓ వ్యక్తిని కొట్టడం కనిపించింది.

సాగాయ్ రాజ్ అనే వ్యక్తి ట్విట్టర్ ఈ ఖుష్బూ వీడియోను పోస్ట్ చేసి అందరూ ఖుష్బూలాగా ధైర్యంగా స్పందించాలని కోరాడు. దీనికి హీరోయిస్ ఖుష్బూ కూడా రీట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Full View

Tags:    

Similar News