క్వారంటైన్ కేంద్రంలో లేడీ కానిస్టేబుల్ రాసలీలలు!

Update: 2020-07-17 07:15 GMT
కరోనా వైరస్ తో  ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతుంటే ..మరోవైపు ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా కొందరు నీచ పనులకి ఒడిగడుతున్నారు. ఏకంగా కొంతమంది క్వారంటైన్ సెంటర్లలోనే వివాహేతర సంబంధాలని కొనసాగిస్తున్నారు. క్వారంటైన్ సెంటర్ కేంద్రంగా  ఓ మహిళా కానిస్టేబుల్ అక్రమ సంబంధానికి తెరతీసింది.  క్వారంటైన్ కేంద్రానికి ఏకంగా లవర్ తో వెళ్లి ,ఏకాంతంగా గడిపి అడ్డంగా బుక్ అయ్యింది. ఈ ఘటన మహారాష్ట్రలో నాగ్‌ పూర్ ‌లో వెలుగు చూసింది.

నాగ్ పూర్ పట్టణంలో ఓ మహిళ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. గత సంవత్సరం అక్టోబర్ లో ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా పోస్టల్ ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. అతనికి అప్పటికే పెళ్లి అయ్యింది. అది తెలిసిన తరువాత కూడా ఆమె అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతున్న సమయంలో నాగ్ పూర్ కు చెందిన ఓ పోలీసు అధికారికి కరోన పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఎవరు సన్నిహితంగా ఉన్నారో…వారిని క్వారంటైన్ కు తరలించారు. నాగపూర్ లేడీ కానిస్టేబుల్ తన భర్త అంటూ ప్రియుడిని పరిచయం చేసింది. దీంతో అధికారులు భార్యభర్తలే అని నమ్మి  క్వారంటైన్ లో ఒకే గది కేటాయించారు. దీనితో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ ఇద్దరూ ఇలా  క్వారంటైన్‌ కేంద్రంలో ఎంజాయ్ చేస్తున్న సమయంలో  అసలు భార్య తన భర్తను వెతుక్కుంటూ క్వారంటైన్ సెంటర్‌ కు వచ్చింది. అయితే, లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న సిబ్బంది అంగీకరించకపోవడంతో బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్‌ లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. కమిషనర్‌ను కలిసి ఆ లేడీ కానిస్టేబుల్‌ కు, తన భర్తకు ఉన్న వివాహేతర సంబంధం గురించి చెప్పింది. ఆ తరువాత దానిపై విచారణ చేయగా .. షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. క్వారంటైన్ కేంద్రంలో ఉన్న లేడీ కానిస్టేబుల్  కు వివాహం కాలేదని, అవివాహితురాలని తేలడంతో డిపార్ట్ మెంట్ వారు ఖంగుతిన్నారు. ఆ తరువాత వెంటనే అతనిని వేరే క్వారంటైన్ సెంటర్‌కు  తరలించారు. 
Tags:    

Similar News