పడగ్గదిలో జొరబడిన డ్రాగన్ ప్రభుత్వం

Update: 2022-04-08 05:44 GMT
డ్రాగన్ ప్రభుత్వం అంటే ఆషామాషీ కాదు. ఇంతకాలం చైనా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లఘించే వారిని ఏ మాత్రం ఉపేక్షించదని కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. కానీ తాజాగా జారీచేసిన ఆదేశాలను చూసిన తర్వాత డ్రాగన్ ప్రభుత్వం అవసరమైతే బెడ్రూముల్లోకి కూడా జొరబడుతుందని అర్ధమైపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ కారణంగా చైనా అల్లాడిపోతోంది.

 కొద్దిరోజులుగా షాంఘైని కరోనా వైరస్ అల్లాడించేస్తోంది. వేలాది కేసులు ప్రతిరోజు బయటపడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 25 వేల కేసులు బయటపడ్డాయి. ఇన్నివేల కేసులు బయటపడటం వరుసగా నాలుగో రోజు.

దాంతో మొదట్లోనే షాంఘై డ్రాగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మొత్తం షాంఘైలో లాక్ డౌన్ ప్రకటించింది. జనాలెవరినీ ఇళ్ళనుండి బయటకు రానీయటం లేదు. ఎవరైనా వచ్చినా వెంటనే వాళ్ళని లోపలకు పంపించేస్తోంది.

 ఇదంతా సరిపోదున్నట్లు తాజాగా మరో విచిత్రమైన ఆదేశాలను జారీ చేసింది. అదేమిటంటే జంటలు కౌగిలించుకోకూడదట. ముద్దులు కూడా పెట్టుకోకూడదట. భార్యా-భర్తలు లేదా ప్రేయసీ ప్రియులు వేర్వరుగా పడుకోవాలని గట్టి హెచ్చరికలు జారీచేసింది.

చివరకు భోజనాలు కూడా విడివిడిగానే చేయాలంటు ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా షాంఘైలోని 2.6 కోట్ల మంది నానా అవస్థలు పడుతున్నారు. లాక్ డౌన్ ఆంక్షలను తట్టుకోలేక కొందరు తమ ఇళ్ళల్లోని బాల్కనీల్లోకి వచ్చి నిరసనగా పాటలు పడారు.

అయితే వెంటనే ప్రభుత్వం డ్రోన్లను ప్రయోగించటం ద్వారా అందరినీ ఇళ్ళల్లోకి వెళ్ళిపోవాలంటు వార్నింగ్ ఇచ్చింది. లాక్ డౌన్ దెబ్బకు నిత్యావసరాలు సరిపడా దొరక్క జనాలు నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మొత్తానికి బెడ్రూముల్లోకి కూడా జొరబడిన ప్రభుత్వంగా డ్రాగన్ కొత్త రికార్డు సృష్టించింది.
Tags:    

Similar News