మనిషి కి మూడు బలుపులు.. గులాబీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Update: 2019-12-24 05:17 GMT
ఏం చెప్పాలనుకుంటే అది చెప్పేస్తాడు. ఎవరేం అనుకుంటారన్నది డోన్ట్ కేర్. దీన్ని గుండె ధైర్యమనాలో.. తెగించిన తత్త్వం అనాలో ఎవరూ చెప్పలేరు. సంచలన వ్యాఖ్యల కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నోటి నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం చర్చిలో క్రైస్తవులకు దుస్తుల పంపిణీ కార్యక్రమానని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు పెన సంచలనంగా మారాయి.

మనిషి కి మూడు బలుపులుంటాయ్ ప్రపంచంలో. ఏం బలుపయా అంటే.. ఒకటి నేను రెడ్డి..నేను వెలమ అనే బలుపు. నా దగ్గర బాగా డబ్బున్నదనే బలుపు రెండోది. నేను బాగా చదువుకున్నా అనే బలుపు మూడోది. కానీ.. ఈ బలుపులు ఉండొద్దు మనిషికి. ఎవడిని కోసినా వచ్చేది రక్తమే . అందరం తినేది అదే అన్నం.. అదే నీరు.. అదే గాలి. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండటం చాలా ముఖ్యమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

గతం లోనూ ఆయన నోటి వెంట సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. గతంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన తనలా ఎమ్మెల్యే కావొద్దని వ్యాఖ్యానించి అందరి నోట్లో నానారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు పెంచితే.. ఉద్యోగులు గడ్డి తినొద్దనే వేతనాలు పెంచారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసి మండి పడ్డారు.

అలాంటి ఆయన ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక వర్గాన్ని.. తెలంగాణ లో బలమైన సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. మరి..దీని పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News