కొత్త మంత్రుల ప్రమాణం చూతం రారండి...

Update: 2022-04-09 12:30 GMT
కొత్త మంత్రుల ప్రమాణానికి కొద్ది గంటల టైమ్ మాత్రమే ఉంది. ముహూర్తం పక్కాగా ఖరారు అయింది. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం పదకొండు గంటల 31 నిముషాల దివ్య ముహూర్తంలో మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ప్రభుత్వం ఆహ్వాన పత్రాలను ముద్రించింది.

మంత్రి వర్గ ప్రమాణ స్వీకారాన్ని చూడడానికి  ప్రముఖులను వీవీఐపీలను, వీఐపీలను  రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది   ఈ ఆహ్వాన పత్రం అందుకున్న వారు ఒకరు మాత్రమే రావాలని ఉంది అని పేర్కొన్నారు.  ఇక ప్రమాణ స్వీకార సమయానికి 35 నిముషాల ముందుగా ఆహ్వానితులు  వచ్చి తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాలని కూడా స్పష్టం చేశారు.

ఇక వేదిక సైతం ఫిక్స్ చేశారు. అసెంబ్లీ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇప్పటికే అక్కడ అంతా చదును చేసి వేదికతో పాటు సమావేశంలో కూర్చేవారికి అవసరం అయిన కుర్చీలను కూడా వేసి సర్వం సిద్ధం చేస్తున్నారు.

ఇక సరిగ్గా ఉదయం 11.31 నిముషాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయిస్తారు. మొత్తానికి మొత్తం 24 మంది అనుకున్నా దానికి గంట దాకా టైమ్ పట్టే చాన్స్ ఉంది. ఆ తరువాత కొత్త మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్యాహ్నం ఒంటిగంటకు సెక్రటేరియ‌ట్ లో సమావేశమవుతారు.

వారికి ఆయన హై టీ పార్టీని ఇస్తారు. అభినందనలు తెలియచేస్తారు. ఆ విధంగా కొత్త మంత్రుల  ప్రమాణ స్వీకార ఘట్టం సాగనుంది. ఇక ప్రభుత్వం ముద్రించిన ఆహ్వానాలు ప్రముఖులకు, వివిధ రంగాలకు సంబంధించిన వారికి ఇప్పటికే పంపిస్తున్నారు. మరి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏ ఏ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారో చూడాల్సి ఉంది.
Tags:    

Similar News