మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Update: 2022-03-30 15:30 GMT
తెలుగుదేశం పార్టీ విమర్శల వాడి పెంచింది. ముఖ్యంగా ఏపీ మంత్రి కొడాలి నాని పరుషంగా మాట్లాడే మాటలకు అంతే కఠినంగా జవాబిచ్చింది.తాజాగా టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆయన కొడాలి నానిపై నోరుపారేసుకున్న తీరు చర్చనీయాంశమైంది.

టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ ‘‘బూచోడులా కనిపిస్తున్న కొడాలి నానిని టీవీలో చూసి పిల్లలు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. థియేటర్లలో సినిమాకు ముందు వచ్చే ఖైనీ, గుట్కా ప్రకటనల్లో కొడాలి నానిని చూపించాలి’’ అని బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు.తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కొడాలి నానిని వైసీపీ నేతలే అసహ్యించుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. మరోసారి ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటూ ప్రజల్లో సెంటిమెంట్ లేవనెత్తుతున్నారని మంత్రి కొడాలి నాని ఇటీవల ఘాటు విమర్శలు చేశారు. దీనిపై బుద్దా వెంకన్న ఈ కౌంటర్ ఇచ్చారు. హరికృష్ణ ఇమేజ్ ను డామేజ్ గా చేసి వెన్నుపోటు పొడిచిన కొడాలి నానిని రాష్ట్ర ప్రజలు చీడపురుగుగా చూస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.

చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయాడని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా చెప్పారా? అలా ఎవరైనా చెబితే రాష్ట్రం విడిచి వెళ్లిపోతా అంటూ బుద్దా వెంకన్న సవాల్ చేశారు. 420 అయిన వైసీపీలో కొడాలి నాని 840 అని.. వైసీపీ పుట్టుకే 420ల నుంచి ఏర్పడిందని కొడాలి నాని మరిచాడా? అని బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రానున్న వైసీపీ కేబినెట్ విస్తరణలో మంత్రిపదవి పోతే విశ్వరూపం చూపిస్తానంటూ కొడాలి నాని ఏకంగా సీఎం జగన్ కు పరోక్ష హెచ్చరికలు పంపాడని బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్ లా తండ్రి అధికారం పెట్టుకొని ప్రజా ధనం దోచుకునే బుద్ది ఎన్టీఆర్ పిల్లలెవ్వరికీ లేదని వెంకన్న పేర్కొన్నారు.


Full View
Tags:    

Similar News