అభినందన్ ను హింసించినోడు చచ్చిపోయాడు

Update: 2019-08-21 08:16 GMT
రీల్ లో హీరో కాస్త కష్టాలు పడినా.. వాటి నుంచి గట్టెక్కుతాడు. అదే సమయంలో విలన్ కొన్ని సుఖాలు అనుభవించినా.. మొత్తంగా చచ్చిపోతాడు. రీల్ లోనే కాదు.. రియల్ లోనూ అలాంటిదే చోటు చేసుకుందన్న భావన తాజా ఉదంతం గురించి తెలిసినంతనే కలుగటం ఖాయం.

భారత్ వాయుసే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఎపిసోడ్ తెలిసిందే. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేయటం.. మరోదాన్ని తరుముకుంటూ పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లటం.. అక్కడ అతడు ప్రయాణిస్తున్న యుద్ధ విమానాన్ని దాయాది కూల్చేయటం తెలిసిందే. ఈ ఉదంతంలో అభినందన్ పాక్ కు పట్టుబడటం తెలిసిందే.

భారత్ తో సహా ప్రపంచ దేశాలన్ని పాక్ మీదకు ఒత్తిడి తేవటంతో అతన్ని అదుపులోకి తీసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే భారత్ కు తిరిగి పంపటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అభినందన్ పట్టుబడిన సమయంలో పాక్ సైన్యానికి చెందిన పాక్ కమాండో అహ్మద్ ఖాన్ హింసించాడు. పాక్ లో పట్టుబడిన వెంటనే పాక్ సైన్యానికి చెందిన కొందరు అతన్ని చిత్రహింసలు పెట్టారు. అలా పెట్టిన వారిలో ప్రముఖుడు అహ్మద్ ఖాన్.

పాక్ ఆర్మీలోని ప్రత్యేక సేవా గ్రూపులో సుబేదార్ గా పని చేస్తున్న అహ్మద్ ఖాన్.. అభినందన్ ను టార్చర్ పెట్టిన ఎపిసోడ్ లో ఉన్నతాధికారుల మనసుల్ని దోచుకున్నారు. అతడికి ప్రత్యేక గుర్తింపు లభించింది. దీంతో చెలరేగిపోయి ఉగ్రవాద సంస్థలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ.. ఉగ్రవాదుల్ని సరిహద్దుల నుంచి తప్పించి.. అక్రమంగా భారత్ భూభాగంలోకి పంపేవాడు. సరిహద్దుల వద్ద బాధ్యతలు నిర్వర్తించే అతగాడు తాజాగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో హతమైన విషయం తాజాగా వెలుగు చేసింది. చొరబాటుదారుల్ని భారత్ లోకి పంపే ప్రయత్నం చేసే వేళలో.. దాయాది దుర్బుద్దిని గుర్తించిన భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇతగాడు హతమైన విషయాన్ని గుర్తించారు.
Tags:    

Similar News