జాగ్రత్తగా ఉండాల్సిందే.. మరోమార్గం లేదు : మోదీ

Update: 2020-09-11 04:15 GMT
కరోనా వ్యాధి పట్ల ప్రజలంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. దేశంలో రోజురోజుకూ  మహమ్మారి విస్తరిస్తున్నదని ప్రజలు తేలికగా తీసుకుంటే ప్రమాదంలో పడతారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించాలని.. కనీసం రెండు భౌతికదూరం పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా ఉమ్మి వేయద్దని సూచించారు. బిహార్​ లో రూ. 20,050 కోట్లతో ఏర్పాటుచేయనున్న ప్రధానమంత్రి మత్య్స సంపద యోజన పథకాన్ని గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యసంపద యోజన పథకం మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకంలో దేశంలో సంపద సృష్టి జరుగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామన్నారు.

ఇదో విప్లవాత్మక పథకం

మత్స్యసంపద యోజన పథకం ఎంతో విప్లవాత్మకమైనదని ప్రధాని మోదీ చెప్పారు. మరో నాలుగేళ్లలో దేశంలో చేపల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది తమ లక్ష్యమన్నారు. పాలరైతుల కోసం ఈ గోపాల అనే మొబైల్​ యాప్​ను కూడా ప్రధాని ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పాడి రైతులకు ఈ యాప్​ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

వ్యాక్సిన్​ వచ్చేవరకు జర భద్రం

కరోనాకు వ్యాక్సిన్​ తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎంతో కృషిచేస్తున్నారని ప్రధాని చెప్పారు. అప్పటివరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారిని,  వయోవృద్ధులను  జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు.
Tags:    

Similar News