బాబు ఫ్రెండ్ నామాపై క్రిమిన‌ల్ కేసు!

Update: 2018-04-06 04:42 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుల్లో ఒక‌రు నామా నాగేశ్వర‌రావు. మాజీ ఎంపీగా సుప‌రిచితులైన ఆయ‌న‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్లో క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది. త‌న భార్య‌తో వివాహేత‌ర సంబంధాన్ని పెట్టుకోవ‌ట‌మే కాదు.. భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి త‌న‌తో ఉండాలంటూ వేధిస్తున్న నామాపై బాధిత మ‌హిళ భ‌ర్త ఫిర్యాదు చేసిన వైనం సంచ‌ల‌నంగా మారింది.

స‌ద‌రు ఫిర్యాదుతో నామాపై కేసు న‌మోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. వివ‌రాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌రు 4లో నివ‌సించే సీకే రామ‌కృష్ణ‌న్ 1992 నుంచి అమెరికాలో ఉంటున్నారు. ఆయ‌న స‌తీమ‌ణి సుజాత హైద‌రాబాద్ లోనే ఉండేవారు. 2014లో రామ‌కృష్ణ‌న్ హైద‌రాబాద్ కు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో మాజీ ఎంపీ నామా త‌ర‌చూ త‌మ ఇంటికి వ‌స్తుండేవారు. 2017లో త‌న భార్య సుజాత‌తో త‌ర‌చూ ఫోన్లో మాట్లాడేవార‌ని.. తాను అమెరికాలో ఉన్న‌ప్పుడు త‌న భార్య త‌న‌కు ఫోన్ చేసిన నామా సోద‌రుడు బెదిరిస్తున్నాడ‌ని చెప్పింద‌న్నారు.

త‌న‌కు భ‌యంగా ఉంద‌ని ఆమె చెప్పింది.. ఆ స‌మ‌యంలో త‌న భార్య ఇచ్చిన ఫిర్యాదుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్లో కేసు పెట్టారు. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం రామ‌కృష్ణ‌న్.. హైద‌రాబాద్ కు వ‌చ్చారు. త‌న భార్య తీవ్ర మాన‌సిక వేద‌న‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు గుర్తించి.. కార‌ణం అడ‌గ్గా.. నామాతో త‌న‌కు 2013 నుంచి వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్లు త‌న భార్య చెప్పార‌న్నారు.

నీ భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి నాతో ఉండు అంటూ నామా ఒత్తిడి తెస్తున్నార‌ని.. భ‌యానికి గురై త‌న‌కు చెప్పిన‌ట్లు రామ‌కృష్ణ‌న్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు నామా నాగేశ్వ‌ర‌రావు.. ఆయ‌న సోద‌రుడు సీత‌య్య‌పై ఐపీసీ సెక్ష‌న్ 497.. 504.. 506 సెక్ష‌న్ల కింత కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News