క్వారంటైన్ లో 40ఏళ్ల మహిళపై అత్యాచారం

Update: 2020-07-18 03:45 GMT
కరోనా కోరలు చాస్తోంది. దీని భయానికి జనాలు వణికిపోతున్నారు. దాని గాలి సోకినా భయకంపితులవుతున్నారు. ఈ సమయంలో క్వారంటైన్ లో ఉన్న మహిళను కూడా వదల్లేదు ఓ కామాంధుడు.

కరోనావైరస్ సోకి పాజిటివ్ గా తేలిన 40 ఏళ్ల మహిళపై గురువారం రాత్రి నవీ ముంబైలోని  క్వారంటైన్ కేంద్రంలో  అత్యాచారం జరిగింది. నిందితుడు కూడా కరోనావైరస్ పాజిటివ్ సోకి అదే క్వారంటైన్ లో ఉంటున్నాడు..

మహిళ ఫిర్యాదు మేరకు ఐపిసి 376 మరియు 254 సెక్షన్ల కింద కేసు నమోదైందని పన్వెల్ తాలూకా పోలీసులు తెలిపారు.

25 ఏళ్ల నిందితుడు కూడా కరోనావైరస్ పాజిటివ్ అని పోలీసులు తెలిపారు. నిందితుడికి పాజిటివ్ కావడంతో అతన్ని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News