హైదరాబాద్ లో విమాన రెస్టారెంట్.. ఏపీ రోడ్డు మీద ఇరుక్కుపోయింది!

Update: 2022-11-15 14:30 GMT
గాల్లో ఎగిరే విమానం.. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ నేల మీద హోటల్ గా మారనుంది. విన్నంతనే కాస్తంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ ఇది నిజం. ఎయిర్ బస్ 320ను హోటల్ గా మార్చేసి.. సరికొత్త అనుభవాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతుంది హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ చైన్ హోటల్ సంస్థ.

కేరళలో జరిగిన వేలంలో ఎయిర్ బస్ ను కొనుగోలు చేసింది హైదరాబాద్ కు చెందిన పిస్తా హౌస్ సంస్థ. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు చైన్ హోటళ్లను నిర్వహించే ఈ సంస్థ హైదరాబాద్ శివారులో మరికొద్ది రోజుల్లో విమాన హోటల్ ను ప్రారంభించనుంది.

ఇందులో భాగంగా కేరళలో జరిగిన వేలంలో పాల్గొన్న ఈ సంస్థ ఎయిర్ బస్ ను సొంతం చేసుకుంది. దాన్ని రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. అయితే.. ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇరుకు రోడ్డు మీద ఇరుక్కుపోయింది.

దీనికి కారణం.. ఒక అండర్ పాస్. అంచనాలకు భిన్నంగా ఈ విమానం ఇరుక్కుపోవటంతో.. దీన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత విమానాన్ని రెస్టారెంట్ మాదిరి మార్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా పిస్తా హౌస్ యజమాని చెబుతున్నారు.

కొచి నుంచి ఒక భారీ ట్రాలీ మీద ఈ విమానాన్ని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. మేదరమెట్ల వద్ద ఉన్న ఒక అండర్ పాస్ లో ఇరుక్కున్న ఈ విమానాన్ని.. ఎలాంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరో.. రెండు.. మూడు రోజుల్లో హైదరాబాద్ కు ఈ విమానం చేరుకుంటుందని.. ఆ వెంటనే రెస్టారెంట్ పనులు మొదలు పెట్టి.. కొత్త ఏడాదికి విమాన రెస్టారెంట్ సిద్ధమవుతుందని చెబుతున్నారు. హైదరాబాద్ రెస్టారెంట్లలో ఇదో కొత్త అనుభూతిని ఇస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News