విజయమ్మ సిఫార్సు.. ఆయనకు మంత్రి పదవి ఖాయమా?

Update: 2019-06-01 01:30 GMT
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం  ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మంత్రి పదవి విషయంలో మరో బలమైన సిఫార్సు లభించినట్టుగా సమాచారం. అది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ నుంచి కావడం గమనార్హం! పార్టీకి తన తల్లిని గౌరవాధ్యక్షురాలు గౌరవిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో కూడా ఆమెనే పక్కనే కూర్చోబెట్టుకున్నారు.

ఇది వరకూ కూడా తన తల్లి సిఫారసు మీద పలువురికి ఎమ్మెల్యే టికెట్లను కేటాయించిన నేపథ్యం ఉంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. ఇలాంటి తరుణంలో మంత్రి పదవి విషయంలో కూడా వైఎస్ విజయమ్మ ఒక సిఫార్సు చేసినట్టుగా సమాచారం. అది జక్కంపూడి రాజాకు మంత్రి పదవి విషయంలో అని ప్రచారం  జరుగుతూ ఉంది.

తాము కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చినప్పటి నుంచి తమ వెంట ఉన్న వారిగా జక్కంపూడి కుటుంబానికి ప్రాధాన్యతను ఇవ్వాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూచించారట విజయమ్మ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు ఆయన వెంట నడిచిన వారిలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఒకరు. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన మరణించారు.

ఆయన భార్య, కొడుకు తర్వాత జగన్ వెంటే నిలిచారు. వారికి జగన్ తగిన ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో రాజాకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు వైస్ జగన్.ఆయన నెగ్గారు. ఇప్పుడు మంత్రి పదవి విషయంలో ఆశావహుడిగా ఉన్నారాయన.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు నేత కావడం కూడా రాజాకు మరో సానుకూలంశంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. విజయమ్మ సిఫార్సుతో ఆయనకు అవకాశాలు మరింత మెరుగు అయ్యాయని.. ఆయనకు మంత్రి పదవి  దాదాపు ఖాయమనే ప్రచారం సాగుతూ ఉంది.t

    

Tags:    

Similar News