పుష్కర స్నానం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి

Update: 2015-07-23 11:28 GMT
    ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో అత్యధిక పేరు ప్రఖ్యాతులు సంపాదించినవారు ముగ్గురేముగ్గురు... ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి ... వైఎస్ మృతిచెందినా ఇప్పటికీ ఆయనపై ప్రజాభిమానం తగ్గని విషయం ఒప్పుకొని తీరాల్సిందే. ఆయన్ను దేవుడిలా ఆరాధించేవారున్నారు. అలాంటి వీరాభిమానులు కొందరు వైఎస్ విగ్రహాన్ని తీసుకొచ్చి గోదావరిలో పుష్కర స్నానం చేయించారు.

    పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలానికి చెందిన వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆ జిల్లాలోని సిద్ధాంతం వద్ద గోదావరిలో వైఎస్ విగ్రహానికి పుణ్య స్నానం చేయించారు. అంతేకాదు... పిండప్రదానం కూడా చేశారు. తరతరాలు గుర్తుంచుకోదగ్గ నేత వైఎస్ కు పుణ్యస్నానం చేయించడం ఆనందంగా ఉందని వారు చెబుతునత్నారు. కాగా దీనిపై స్థానిక టీడీపీ వర్గాలు మాత్రం సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నాయి. పుష్కర స్నానంతోనైనా వైఎస్ పాపాలు పోయి పుణ్యం సమకూరుతుంది అని వారు సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News