అక్కినేని స్టార్స్.. అసలెందుకిలా..?

ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా ఇప్పటికే సినిమాల్లోకి వచ్చేశారన్న సంగతి విదితమే.

Update: 2024-10-20 05:27 GMT

టాలీవుడ్ ప్రముఖ కుటుంబాల్లో ఒక్కటైన అక్కినేని కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఇండస్ట్రీలోకి పలువురు హీరోలు వచ్చిన విషయం తెలిసిందే. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కొన్నేళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఆరు పదుల వయసులో కూడా తెలుగు సినీ ప్రియులను అలరిస్తున్నారు. వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా ఇప్పటికే సినిమాల్లోకి వచ్చేశారన్న సంగతి విదితమే.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఒకేసారి ముగ్గురికి ఒకేలాంటి పరిస్థితి తలెత్తిందని నెటిజన్లు చెబుతున్నారు. తండ్రీకొడుకుల ముగ్గురికీ ఒకే సమస్య ఎదురవ్వడం విచిత్రంగా ఉందని అంటున్నారు. అది యాదృచ్ఛికంగా జరిగినా.. దాని వెనుక ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. అసలేం జరిగింది? నాగ్, చైతూ, అఖిల్ కు ఎదురైన పరిస్థితి ఏంటంటే?

మొదట నాగ్ ను చూసుకుంటే.. ఆయనకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిస్తొందన్న విషయం ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ అయింది. గతంలో ఆయన చిత్రాలు.. పొంగల్ కు వచ్చి మంచి హిట్ అయ్యాయి. అలాగే 2025 సంక్రాంతికి కూడా ఒక మూవీతో వద్దామనుకున్నారు. కానీ ఇప్పటి వరకు రిలీజ్ పై ఆయా డైరెక్టర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈసారి పొంగల్ కు నాగార్జున రానట్లే. సంక్రాంతి బుల్లోడుగా ఎప్పుడూ సందడి చేసే ఆయన ఈసారి కాస్త లేట్ గా రానున్నారు!

ఇక నాగచైతన్య.. ప్రస్తుతం తండేల్ మూవీపై కంప్లీట్ ఫోకస్ పెట్టారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో ఉత్తరాంధ్ర మత్స్యకారుడిగా కనిపించనున్నారు. ఆ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుందని అంతా భావించారు. గేమ్ ఛేంజర్ సంక్రాంతికి షిఫ్ట్ అయింది కాబట్టి.. డిసెంబర్ లో రిలీజ్ పక్కా అనుకున్నారు. కానీ అప్పటికి ఫస్ట్ కాపీ, సెన్సార్ అవ్వకపోవచ్చని తెలుస్తోంది. దీంతో తండేల్ చిత్రాన్ని మేకర్స్ కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయనున్నారని చెబుతున్నారు.

సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలు వస్తున్నా.. మేకర్స్ స్పందించడం లేదు. సంక్రాంతికి కూడా కుదరకపోతే రిపబ్లికే డేకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. చివరగా మరో అక్కినేని హిరో అఖిల్.. ఏజెంట్ మూవీ తర్వాత ఇప్పటికీ కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. అఖిల్ ఆరో మూవీ కోసం ఎప్పటికప్పుడు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నా.. ఇంతవరకు ఒక్క అనౌన్స్మెంట్ కూడా అఫీషియల్ గా రాలేదు. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. ముగ్గురు కూడా ప్రస్తుతం ఆలస్య పర్వంలో ఉన్నారన్నమాట. ఇక వీరి ఫ్యామిలీకి చెందిన సుశాంత్, సుమంత్ కూడా తదుపరి సినిమాల విషయంలో పెద్దగా అప్డేట్స్ ఇవ్వడం లేదు.

Tags:    

Similar News