పుష్ప-2 కోసం బన్నీ సాలీడ్ హైప్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతటి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2024-10-05 16:30 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతటి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప సినిమా మొదటి భాగం 2021లో విడుదలై అంచనాలకు మించి సక్సెస్ సాధించి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు, హిందీ సహా అన్ని ప్రధాన భాషల్లో ఘన విజయాన్ని అందుకుంది.

ప్రత్యేకంగా హిందీ మార్కెట్‌లో కూడా భారీ వసూళ్లు సాధించి, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా తన స్థానాన్ని బలపరచుకున్నారు. ఇప్పుడు ఈ సక్సెస్‌ను కొనసాగించేందుకు బన్నీ సుకుమార్ దర్శకత్వంలో మరోసారి స్క్రీన్ మీదకు వస్తున్నారు. పుష్ప-2 సీక్వెల్‌గానే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆధ్యంతం యాక్షన్, ఎమోషన్స్, సస్పెన్స్, డ్రామాలతో ప్రేక్షకులను కట్టిపడేయనుంది.

అల్లు అర్జున్, సుకుమార్ ఈ సారి మరింత సాలిడ్ ప్లాన్ తో ముందుకుసాగుతున్నారు. మొదటి భాగం ప్రీ రిలీజ్ సమయంలో నార్త్ ఇండియాలో పెద్దగా ప్రమోషన్స్ లేకుండా విడుదల చేశారు. అంచనాలు పెద్దగా లేకపోయినా, సినిమా నార్త్ ఇండియన్ మార్కెట్లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఈ సక్సెస్‌ బన్నీకి నార్త్ మార్కెట్‌లో మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఈ సారి ఈ క్రేజ్‌ను మరింత సద్వినియోగం చేసుకోవడానికి బన్నీ మరియు చిత్ర యూనిట్ ప్రత్యేకంగా నార్త్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది. ఈ సారి పెద్ద ప్రొడక్షన్, ప్రమోషన్ ప్లాన్ తో నార్త్ మార్కెట్లో పుష్ప-2 చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం నార్త్ ప్రమోషన్స్ కోసం బడ్జెట్ కేటాయించడం విశేషం. ఈమద్యే వచ్చిన దసరా హిట్ కావడంతో తెలుగులో మిగతా హీరోలకు మరింత నమ్మకం ఏర్పడింది. దీంతో పుష్ప రాజ్ ప్రమోషన్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.

పుష్ప-2 సీక్వెల్ కావడంతో మొదటి భాగం విజయంతో ప్రేక్షకుల్లో అంచనాలు గణనీయంగా పెరిగాయి. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో చూపించిన యాక్టింగ్, తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్‌ను మరింత ఎలివేట్ చేసి ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన చిన్న చిన్న టీజర్స్, పోస్టర్స్ ఈ అంచనాలను మరింత పెంచాయి.

ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లి పాత్రలో కనిపించబోతోంది. ఆమె నటన కూడా ఈ సినిమాకు పెద్ద అట్రాక్షన్‌ అయ్యే అవకాశం ఉంది. అలాగే, ఫహాద్ ఫాజిల్ మరోసారి భాన్వర్ సింగ్ పాత్రలో తన విలనిజం చూపించబోతున్నాడు. ఈ సినిమా కేవలం కథా పరంగానే కాకుండా నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ప్రేక్షకులకు మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News