ఆ ఒత్తిడి తట్టుకోలేకే.. ఆ విషయాన్ని దాచాను..!

Update: 2022-12-16 02:30 GMT
రెండు దశాబ్దాల సక్సెస్ ఫుల్ సినీ కెరీర్ ను కొనసాగించిన శ్రీయ శరణ్ ఇప్పటికీ ఏదో ఒక సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్ స్టార్స్ అందరితో జత కట్టిన ఈ అమ్మడు తన లైఫ్ లో జరిగిన ఒక పెద్ద విషయాన్ని సీక్రెట్ గా ఉంచింది. సినిమా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న టైం లో అమ్మడు 2018 ఆండ్రీ అనే బిజినెస్ మెన్ ని పెళ్లాడింది. 2021లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ టైం మొత్తం అసలు మీడియా కంటికి కనిపించకుండా చాలా సీక్రెట్ గా ఉంచింది శ్రీయ శరణ్.

రీసెంట్ గా తను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చుకుంది. తన కూతురు రాధ కడుపులో ఉన్న అందమైన క్షణాలు ఒత్తిడితో గడపాలని అనుకోలేదు. ఆ టైం లో ఎలాంటి వారైనా సరే బరువు పెరుగుతారు. హీరోయిన్స్ అవడం వల్ల దాన్ని సాధారణ విషయంగా చూడలేరు. అందుకే తను ప్రెగ్నెన్సీ ఫోటోలను షేర్ చేయలేదని అన్నది శ్రీయ.

తన ప్రెగ్నెన్సీ వార్త బయటకు వస్తే మీడియా ఇంకా ఫ్యాన్స్ తన ఫోటోలని ట్రోల్స్ చేస్తారు. తన బిడ్డ మీద కూడా ఫోకస్ చేస్తారు. వాటికి దూరంగా ఉండాలని.. ఆ ఒత్తిడి తగ్గించుకోవాలని శ్రీయ ఆ టైం లో అంతా సీక్రెట్ గా ఉంచినట్టు చెప్పుకొచ్చింది.

సెలబ్రిటీస్ పర్సనల్ విషయాల్లో మీడియా అత్యుత్సాహం అందరికి తెలిసిందే. సమాచారం ఇవ్వడం వరకు ఓకే కానీ వారి ఒపీనియన్ ని సెలబ్రిటీస్ మీద బలవంతంగా రుద్దినప్పుడే వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే శ్రీయ ఇలాంటి తలనొప్పులు ఎందుకని తన ప్రెగ్నన్సీ టైం ని అంతా కూడా కేవలం భర్తతో పాటే ఉంటూ ఒక్క ఫోటోని కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడింది. శ్రీయ చేసింది మంచి పనే అంటున్నారు కొందరు. సౌత్ సినిమాలతోనే కాదు బాలీవుడ్ లో కూడా శ్రీయ సినిమాలు చేస్తుంది.    

రీసెంట్ గా దృశ్యం 2 లో ఆమె నటించింది. ఆ సినిమా ప్రమోషన్స్ లోనే శ్రీయ తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన విషయాలు.. మీడియాకు దూరంగా ఉన్న కారణాలను పంచుకున్నారు. పెళ్లై.. ఒక బిడ్డకు తళ్లైనా సరే శ్రీయ మాత్రం గ్లామర్ షో లో అదరగొట్టేస్తుంది. రోజుకొక కొత్త ఫోటో షూట్ తో శ్రీయ ఇప్పటికీ తనలో అందం ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News