ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే. దక్షిణాది సినిమా అంటే పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. సినిమా అంటే ప్రపంచ సినిమా దృష్టిలో బాలీవుడ్ సినిమా మాత్రమే. అయితే `బాహుబలి` తో మార్పు మొదలైంది. ఇండియన్ సినిమాకు అడ్రస్ మారడం స్టార్టయింది. సాహో, కేజీఎఫ్ చాప్టర్ 1, పుష్ప చిత్రాలతో భారతీయ సినీ దిగ్గజాల ఫేకస్ దక్షిణాది వైపు షిప్ట్ అయింది. `ట్రిపుల్ ఆర్` రిలీజ్ తో ఇప్పడు ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఒకటే మాట సౌత్ సినిమా.
భారతీయ సినిమాకు సౌత్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోందనే సంకేతాల్ని `ట్రిపుల్ ఆర్` ఇండియన్ సినిమాకు బలమైన సంకేతాల్ని అందించింది. `బాహుబలి`తో భారతీయ సినిమా ప్రపంచంలో మార్పు మొదలైంది. ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే కాదని, అంతకు మించిన సౌత్ సినిమా వుందని యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇప్పటికీ తెలిసొస్తోంది. అంతే కాకుండా తెలుగు సినిమా `బాహుబలి` ఇచ్చిన ధైర్యంలో సౌత్ లోని ఇతర ఇండస్ట్రీలైన తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా స్థాయి సినిమాల పరంపర మొదలైంది.
తాజాగా విడుదలైన ట్రిపుల్ ఆర్ బాలీవుడ్ మేకర్స్ కళ్లు తెరిపించడమే కాకుండా హాలీవుడ్ స్టాయి చిత్రాలని మనమూ తీయగలమని నిరూపించి బాలీవుడ్ కు సైతం పాఠాలు నేర్పుతోంది. దేశ వ్యాప్తంగా ఈ మూవీ సాధిస్తున్న కలెక్షన్ లే ఇందుకు నిదర్శనం. భారతీయ ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో ఈ సినిమాతో మరో సారి స్పష్టమైంది. హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీస్తే అదే స్థాయిలో ఆదరిస్తామని, జేజేలు పలుకుతామని `ట్రిపుల్ ఆర్` ఫలితంతో మరో సారి రుజువు చేశారు.
ఈ మూవీ తరువాత దక్షిణాది నుంచి పాన్ ఇండియా చిత్రాల దండయాత్ర మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది భారతీయ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోందా? ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రానున్న సినిమాలు కూడా వరుసగా రికార్డుల మోత మోగిస్తే జరుగుతున్న చర్చ నిజం అవ్వగం ఖాయం అని అంటున్నారు. ట్రిపుల్ ఆర్ తరువాత తమిళ స్టార్ హీరో నటించిన `బీస్ట్` ఏప్రిల్ 13న విడుదల కాబోతోంది. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేస్తున్నారు. దీనిపై భారీ అంచనాలే వున్నాయి.
ఈ మూవీ తరువాత ఏప్రిల్ 14న `కేజీఎఫ్ చాప్టర్ 2` రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించడంతో పార్ట్ 2 పై బారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఓ రేంజ్ లో వుండటంతో దేశ వ్యాప్తంగా ఈమూవీ సంచలనాలు సృష్టించడం ఖాయం అంటున్నారు. ఈ మూవీ తరువాత లైన్ లో ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు సలార్, అది పురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ రాబోతున్నాయి. వీటితో పాటు బన్నీ `పుష్ప 2` కూడా లైన్ లో వుంది.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్ -1`ఇదే ఏడాది రాబోతోంది. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాల లైనప్ చూసిన వారంతా ఇండియన్ సినిమా అంటే ఈ చిత్రాల తరువాత సౌత్ అనే మాట వినిపించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
భారతీయ సినిమాకు సౌత్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోందనే సంకేతాల్ని `ట్రిపుల్ ఆర్` ఇండియన్ సినిమాకు బలమైన సంకేతాల్ని అందించింది. `బాహుబలి`తో భారతీయ సినిమా ప్రపంచంలో మార్పు మొదలైంది. ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే కాదని, అంతకు మించిన సౌత్ సినిమా వుందని యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇప్పటికీ తెలిసొస్తోంది. అంతే కాకుండా తెలుగు సినిమా `బాహుబలి` ఇచ్చిన ధైర్యంలో సౌత్ లోని ఇతర ఇండస్ట్రీలైన తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా స్థాయి సినిమాల పరంపర మొదలైంది.
తాజాగా విడుదలైన ట్రిపుల్ ఆర్ బాలీవుడ్ మేకర్స్ కళ్లు తెరిపించడమే కాకుండా హాలీవుడ్ స్టాయి చిత్రాలని మనమూ తీయగలమని నిరూపించి బాలీవుడ్ కు సైతం పాఠాలు నేర్పుతోంది. దేశ వ్యాప్తంగా ఈ మూవీ సాధిస్తున్న కలెక్షన్ లే ఇందుకు నిదర్శనం. భారతీయ ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో ఈ సినిమాతో మరో సారి స్పష్టమైంది. హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీస్తే అదే స్థాయిలో ఆదరిస్తామని, జేజేలు పలుకుతామని `ట్రిపుల్ ఆర్` ఫలితంతో మరో సారి రుజువు చేశారు.
ఈ మూవీ తరువాత దక్షిణాది నుంచి పాన్ ఇండియా చిత్రాల దండయాత్ర మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది భారతీయ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోందా? ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రానున్న సినిమాలు కూడా వరుసగా రికార్డుల మోత మోగిస్తే జరుగుతున్న చర్చ నిజం అవ్వగం ఖాయం అని అంటున్నారు. ట్రిపుల్ ఆర్ తరువాత తమిళ స్టార్ హీరో నటించిన `బీస్ట్` ఏప్రిల్ 13న విడుదల కాబోతోంది. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేస్తున్నారు. దీనిపై భారీ అంచనాలే వున్నాయి.
ఈ మూవీ తరువాత ఏప్రిల్ 14న `కేజీఎఫ్ చాప్టర్ 2` రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించడంతో పార్ట్ 2 పై బారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఓ రేంజ్ లో వుండటంతో దేశ వ్యాప్తంగా ఈమూవీ సంచలనాలు సృష్టించడం ఖాయం అంటున్నారు. ఈ మూవీ తరువాత లైన్ లో ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు సలార్, అది పురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ రాబోతున్నాయి. వీటితో పాటు బన్నీ `పుష్ప 2` కూడా లైన్ లో వుంది.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్ -1`ఇదే ఏడాది రాబోతోంది. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాల లైనప్ చూసిన వారంతా ఇండియన్ సినిమా అంటే ఈ చిత్రాల తరువాత సౌత్ అనే మాట వినిపించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.