ఆదిపురుష్.. మరో సర్‌ప్రైజ్‌ కోసం డేట్ ఫిక్స్!

Update: 2022-10-11 08:30 GMT
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూసిన ఆదిపురుష్ సినిమా టీజర్ అంచనాలను అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా టీజర్ ను థియేటర్లో 3Dలో చాలా బాగుంటుంది అని చిత్ర యూనిట్ ఆ తర్వాత మరో క్లారిటీ ఇవ్వడంతో ఓ వర్గం అభిమానులు బాగానే రియాక్ట్ అయ్యారు. కానీ పూర్తిస్థాయిలో ఈ ప్లాన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది కాస్త సందేహంగానే ఉంది.

ఏదేమైనా కూడా చిత్ర యూనిట్ మాత్రం వచ్చిన నెగటివ్ కామెంట్స్ ను మళ్ళీ అందరూ మరిచిపోయే విధంగా చేయాలి అని ప్రేక్షకులను మరింత సంతృప్తి పరిచేలా మరో అప్డేట్ ప్లాన్ చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రభాస్ ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ప్రచారాలు చేసిన చిత్ర యూనిట్ సభ్యుల పై కొంతమంది ఫ్యాన్స్ అయితే ఆగ్రహంతోనే ఉన్నారు.

ఇక వారిని చల్లార్చాడానికి టీం తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రభాస్ అక్టోబర్ 23న తన పుట్టినరోజు సందర్భంగా మరొక టీజర్ విడుదల చేసే విధంగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు ఓం రౌత్ కూడా ఇప్పటికే సెకండ్ టీజర్ కు సంబంధించిన సగం పనులను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇక టీజర్ తప్పకుండా ఆడియన్స్ కు నచ్చే విధంగానే ఉంటుందట.

అలాగే ప్రస్తుతం వస్తున్న కాంట్రవర్సీల నుంచి కూడా చిత్ర యూనిట్ బయటపడేందుకు ప్రయత్నం చేస్తోంది. రామాయణం కథ ఆధారంగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో కృతి సనోన్ సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాను 2023 జనవరిలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాలి అని ప్రభాస్ ఐతే స్పెషల్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా సెకండ్ టీజర్ విడుదల చేసి ఆ తరువాత వివిధ భాషల్లో కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్స్ పెట్టాలి అని చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచిస్తున్నారు. మరి ఈసారి వచ్చే టీజర్ ఏ విధంగా రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News