అందరి ఫ్యాన్స్ కు సోపు వేస్తున్నాడే

Update: 2017-06-20 04:45 GMT
అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ డీజే - దువ్వాడ జగన్నాధం ప్రమోషన్స్ పీక్స్ లోకి చేరుకున్నాయి. సినిమా రిలీజ్ కు ఇంకా మూడు రోజులు మాత్రమే టైం ఉండడంతో.. అన్ని రకాలుగాను ప్రచారంతో హోరెత్తించేస్తున్నారు. పోస్టర్లు.. ఛానెళ్లు.. సోషల్ మీడియా.. ఇలా ఏ ఒక్క ప్లాట్ ఫాంను వదలకుండా పబ్లిసిటీ హంగామా నడిచేస్తోంది.

తాజాగా ఈ సినిమాలోని 'సీటీమార్' సాంగ్ ప్రోమోను తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశాడు నిర్మాత దిల్ రాజు. టీవీల్లో కూడా ఈ ప్రోమో హంగామా చేస్తుండగా.. ఈ పాటలోని ఒక లైన్ ను చూస్తే.. బన్నీ ఎంతటి దేశ ముదురు అనే విషయం అర్ధమవుతుంది. 'ఎన్టీఆర్.. ఏఎన్నార్.. మెగాస్టార్.. నిన్నే చూస్తే విజిలేస్తార్' అంటూ సాగే ఒక్క లైన్ లో.. ముగ్గురి స్టెప్స్ ను ఇమిటేట్ చేశాడు బన్నీ. ఇటు మెగాఫ్యాన్స్ అండ ఎలాగూ ఉండే బన్నీ..  నందమూరి.. అక్కినేని ఫ్యాన్స్ కు కూడా గేలం వేసేయడం.. అది కూడా సింగిల్ స్టెప్ తో సోప్ వేసేయడం ఆశ్చర్యకరం.

సహజంగా స్టార్ హీరోలు ఎవరూ పక్క హీరోల పేర్లను తమ సినిమాల్లో వినిపించేందుకు ఇష్టపడరు. తండ్రి.. తాత.. బాబాయ్ లాంటి డైలాగ్స్.. డాన్స్ తప్ప వేరేవి కనిపించవు. కానీ బన్నీ మాత్రం ఏ మాత్రం సంకోచం లేకుండా.. ఎన్టీఆర్- ఏఎన్నాఆర్ అంటూ పాట వేసుకోవడమే కాదు.. వారి స్టెప్స్ ను కూడా ఇమిటేట్ చేసి పారేశాడు. డిజె కోసం ఇంత ఓవర్ గా ప్రచారం ఎందుకు చేస్తున్నాడో మరి!!

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News