బాహుబలి తర్వాత శతమానం -బన్నీ

Update: 2017-04-16 09:27 GMT
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన శతమానం భవతి చిత్రం జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శతమానం టీంకు అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి పలువురు స్టార్స్ హాజరయ్యారు.

శతమానం భవితి టీం ప్రత్యేకంగా అభినందనలు చెప్పాడు అల్లు అర్జున్. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తను హీరోగా డీజే- దువ్వాడ జగన్నాధం చేస్తున్న బన్నీ.. శతమానం లాంటి చిత్రాన్ని అందించిన టీంకు అభినందనలు చెప్పాడు.  'శంకరాభరణం.. గీతాంజలి తర్వాత ఆ స్థాయి అవార్డు గెలుచుకున్న మూవీ శతమానం.. టాలీవుడ్ స్థాయిని మరింతగా పెంచింది. మన పరిశ్రమ ఖ్యాతిని బాహుబలి పెంచగా.. అలాంటి ఫీట్ ను శతమానం భవతి సాధించింది' అన్నాడు బన్నీ.

ఇదే ఈవెంట్ లో పాల్గొన్న హీరో నాని 'నేను ఉండే అపార్ట్ మెంట్ దగ్గర 90 ప్లస్ అందరూ రోజూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ రీసెంట్ గా ఒక రోజు ఒక్క పెద్దాయనే ఉన్నాడు. తాతయ్యా.. ఏమైంది ఒక్కరే ఉన్నారు అని అడిగితే.. శతమానం భవతి వస్తోందని అంతా వెళ్లపోయారని చెప్పారు. అంతగా అందరినీ ఈమూవీ ఆకట్టుకుంది. డబ్బులు ప్రశంసలు రెండూ వచ్చిన సినిమాకి అవార్డు కూడా రావడం సంతోషంగా ఉంది' అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News