వర్మ సినిమా కలెక్షన్స్‌ గర్జిస్తున్నాయట

Update: 2019-12-13 07:14 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ పంతం నెగ్గించుకున్నాడు. ఎవరు ఎంతగా గింజుకున్నా.. గుంజుకున్నా తాను అనుకున్నట్లుగా 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అలియాస్‌ కమ్మరాజ్యం లో కడప బిడ్డలు సినిమాను విడుదల చేశాడు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో నిజ జీవిత పాత్రలను తీసుకుని కల్పిత సన్నివేశాలతో వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుండి విపరీతంగా వివాదాస్పదం అయ్యింది. అయినా కూడా వర్మ ఎవరైతే నాకేంటి నేను అనుకున్నది తీస్తాను చూపిస్తాను అంటూ ఈసినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమాకు సెన్సార్‌ కష్టాలు తలెత్తాయి. హై కోర్టు కూడా సినిమా కు స్టే విధించింది. ఎట్టకేల కు నిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ లో సినిమా గురించి తెగ హడావుడి చేశాడు. విడుదలైన తర్వాత కూడా వర్మ అదే కంటిన్యూ చేస్తున్నాడు. సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తుందని.. చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్టర్‌ ద్వారా తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు.

ట్విట్టర్‌ లో వరుసగా వర్మ ట్వీట్స్‌ చేశాడు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తొలి రోజు కలెక్షన్స్‌ గర్జిస్తున్నాయి. రియల్‌ లైఫ్‌ పాత్రల తో కల్పిత సన్నివేశాలతో తీసిన ఈ సినిమా ను ప్రేక్షకులు ఆధరిస్తున్నారు అంటూ ఒక ట్వీట్‌ చేశాడు. మరో ట్వీట్‌ లో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా థియేటర్‌ వద్ద ప్రేక్షకుల హడావుడికి సంబంధించిన ఒక ఫొటోను ట్వీట్‌ చేసి టీమ్‌ కు కంగ్రాట్స్‌ తెలియజేశాడు.
Tags:    

Similar News