బాల‌య్య‌-గోపీచంద్ మూవీ లైన్ లీక్‌.. నెట్టింట హ‌ల్‌చ‌ల్‌!

Update: 2022-02-25 03:52 GMT
గ‌త కొంత కాలం నుంచీ వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తమైన న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ ఇటీవ‌ల విడుద‌లైన `అఖండ‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ మూవీ 2021, డిసెంబ‌ర్ 2న విడుద‌లై.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. అలాగే ఎన్నో అద్భుత‌మైన రికార్డుల‌ను సైతం కొల్ల‌గొట్టింది.

దీంతో అఖండ స‌క్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న బాల‌య్య‌.. త‌న 107వ చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై ర‌వి శంక‌ర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..  వరలక్ష్మీ శరత్ కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఎస్‌. ఎస్‌. త‌మ‌న్ ఈ మూవీకి స్వ‌రాలు అందిస్తున్నారు.

గ‌త ఏడాది ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభం కాగా.. ఇటీవ‌లె తెలంగాణ‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో షూటింగ్‌ని మొద‌లుపెట్టిన‌ మేక‌ర్స్‌.. బాల‌య్య ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఇదిలా ఉండ‌గా.. బాల‌య్య‌-గోపీచంద్ మూవీ లైన్ ఇదేనంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

దాని ప్ర‌కారం.. ప్ర‌జ‌ల కోసం నీటి సమస్యపై పోరాడే తండ్రి కొడుకుల కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంద‌ట‌. ఈ చిత్రంలోనూ బాల‌య్య ద్విపాత్రాభినయం చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలీదుగానీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ వార్త జోరుగా వైర‌ల్ అవుతోంది.


Tags:    

Similar News