కెమెరా ఆగింది సెల్ ఫోన్ స్క్రోలింగ్ మొద‌లైంది

Update: 2022-03-01 13:51 GMT
సోష‌ల్ మీడియా.. ఆండ్రాయిడ్ ఫోన్ ల యుగం వ‌చ్చాక ప్ర‌తీ ఒక్క‌రూ రియ‌ల్ లైఫ్ ని మ‌ర్చిపోయి ఫోన్ లోకంలోనే విహ‌రించ‌డం మొద‌లుపెట్టారు. ఇళ్ల‌ల్లో ఇది మ‌రీ ఎక్కువైపోయింది. అయితే ఇందుకు స్టార్ హీరోలు కూడా మిన‌హాయింపు కాదు అని స్టార్ హీరోలు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నిరూపించారు. ఇటీవ‌లే `ధ‌మాకా` సెట్ లో షూటింగ్ గ్యాప్‌లో ఆండ్రాయిడ్ ఫోన్ చూస్తూ హ‌ల్ చ‌ల్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు.

ఆ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. తాజాగా స్టార్ హీరోలు మెగా పవ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా సెల్ ఫోన్ ప‌ట్టుకుని సెట్ లో సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా అభిమానుల‌తో పంచుకున్నారు.

దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఎప్పుడెప్ప‌డా అని ఎదురుచూస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించారు. గ‌త కొంత కాలంగా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కే మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం విడుద‌ల చేసిన స్టిల్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ గ్యాప్ లో విశ్రాంతి ల‌భించ‌డంతో షాట్ గ్యాప్ లో ఇద్ద‌రు హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ మైదానంలోని ప‌చ్చ‌టి గ్రాస్ పై ప‌డుకుని సేద తీరారు. పిల్లోస్‌ పెట్టుకుని ప‌చ్చిక‌పై కొంత సేపే విశ్రాంతి తీసుకున్నారు.

అయితే ఈ స‌మ‌యంలో ఇద్ద‌రి చేతుల్లో ఫోన్ లు క‌పించ‌డం గ‌మ‌నార్హం. కెమెరా ఆగింది సెల్ ఫోన్ స్క్రోలింగ్ మొద‌లైంది అని టీమ్ షేర్ చేసిన‌ట్టుగానే కెమెరా ఆగిపోవ‌డంతో విశ్రాంతికి రెడీ అయిన హీరోలు కెమెరా స్క్రీన్ ల‌ని స్క్రోల్ చేయ‌డం విశేషం.

మార్చి రెండ‌వ వారం నుంచి ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించ‌బోతున్నారు. గ‌త కొంత కాలంగా రిలీజ్ వాయ‌దా న‌డుతూ వ‌స్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` మార్చి 25న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 14 భాష‌ల‌లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల కానుంది.  మెగా ప‌వ‌ర్ స్టార్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా .. ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమ‌రం భీంగా న‌టించిన ఈ చిత్రం 1920 కాలంలో సాగే స్వాతంత్య్ర పోరాటం నేప‌థ్యంలో సాగ‌నుంది.

బాలీవుడ్ హీరోయిన్ అలియాభ‌ట్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతుండ‌గా అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించారు. కీల‌క పాత్ర‌ల్లో హాలీవుడ్ న‌టులు రే స్టీవెన్ స‌న్‌, అలీస‌న్ డూడీ, ఒలివియా మోరీస్‌, శ్రియ‌, స‌ముద్ర‌ఖ‌ని న‌టించారు. జ‌న‌వ‌రి 7న రిలీజ్ కావ‌ల్సిన ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం 20 కోట్లు ఖ‌ర్చు చేసిన చిత్ర బృందం మార్చి 25న రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం మ‌రోసారి భారీ స్థాయిలో ప్ర‌మోష‌న్స్ కోసం ఖ‌ర్చు చేయ‌నుంద‌ట‌. 
Tags:    

Similar News