నాల్గ‌వ పెళ్లికి న‌టి ప‌చ్చ‌జెండా!

వనితా విజయ్ కుమార్... ఈ పేరు నెటీజన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె పేరు చెప్పిన వెంటనే మూడు పెళ్ళిలు గుర్తుకు వస్తాయి.

Update: 2024-10-01 16:30 GMT

వనితా విజయ్ కుమార్... ఈ పేరు నెటీజన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె పేరు చెప్పిన వెంటనే మూడు పెళ్ళిలు గుర్తుకు వస్తాయి. పెళ్లి ల మీద పెళ్ళిలు చేసుకున్న ఆమె ఆమ‌ధ్య‌ మూడవ భర్తకు కూడా దూరం అయ్యింది. కొన్నాళ్ల క్రితం తాను సింగిల్ గా ఉన్నట్లుగా ఆమె ప్రకటించింది. అటుపై మళ్ళీ ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్ర‌చారం చాలా కాలంగా సాగుతోంది.

తాజాగా వ‌నితా విజ‌య్ కుమార్ ఆ ప్రచారాన్ని నిజం చేసింది. నాల్గ‌వ పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తెలిసిన కొరియోగ్రాఫ‌ర్ తో మ‌ళ్లీ ఏడు అడుగులు వేస్తుంది. అక్టోబ‌ర్ 5న పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసారు. మ‌రి ఆ కోరియోగ్రాఫ‌ర్ ఎవ‌రు? అంటే అత‌డు తెలిసిన‌వాడే. రాబ‌ర్ట్ అనే కోరియోగ్రాఫ‌ర్ తో స‌హ‌జీవ‌నం చేస్తుంద‌ని నాలుగేళ్ల క్రిత‌మే వార్త‌లొచ్చాయి.

కానీ అదే స‌మ‌యంలో ఫోటోగ్రాఫ‌ర్ పీట‌ర్ పాల్ ని పెళ్లి చేసుకుంది. కానీ ఈ బంధం నాలుగు నెల‌ల‌కే ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత విడిపోయారు. కానీ పీట‌ర్ తో పెళ్లి జ‌ర‌గ‌లేద‌ని..కేవ‌లం నిశ్చితార్దం మాత్ర‌మే జ‌రిగింద‌ని అప్ప‌ట్లో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. తాజాగా మ‌ళ్లీ ఆ పాత రాబ‌ర్ట్ నే ఇప్పుడు నాల్గ‌వ వివాహం చేసుకుంటుంది. వ‌నిత వ‌య‌సు ఇప్పుడు 43 ఏళ్లు.

ఆమె కుమార్తె జోవిక బిగ్ బాస్ లోనూ పాల్గొంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. 1995లో `చంద్ర‌లేఖ` సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత 2000 ఏడాదిలో న‌టుడు ఆకాష్ ని పెళ్లి చేసుకుంది. ఆ జంట‌కు కుమార్తె..కొడుకు ఉన్నారు. 2005లో విడిపోయారు. త‌ర్వాత 2007 లో ఆనంద్ జ‌య ద‌ర్శ‌న్ అనే వ్యాపార వేత్త‌ని వివాహం చేసుకుంది. ఈ జోడీకి ఓ కుమార్తె ఉంది. ఈ జంట 2012 లో విడిపోయింది.

Tags:    

Similar News