చిరు, బాలయ్య.. దర్శకుల్లోనే ఫ్యాన్ వార్!

Update: 2023-01-04 06:30 GMT
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అలాగే నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి రెండు సినిమాలు కూడా సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అంచనాలకు తగ్గట్టుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. అయితే ఈ రెండు సినిమాల హీరోల మధ్య కూడా గతంలో చాలాసార్లు పోటీ ఎదురయింది. ఇక సంక్రాంతి ట్రాక్ లో అయితే ఇద్దరు హీరోలు వారి రేంజ్ కు తగ్గట్టుగా బాగానే కలెక్షన్స్ అందుకుంటూ వచ్చారు.

అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు మాత్రం చాలా ప్రత్యేకమైనవి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రెండు సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన ఇద్దరు దర్శకులు కూడా హీరోల అభిమానులుగా  పెరిగినట్లుగా చెప్పుకున్నారు.

ముఖ్యంగా బాబీ అయితే ఆ మధ్య ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి తాను చిన్నప్పటి నుంచి కూడా వీరాభిమాని అంటూ ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకొని ఇండస్ట్రీలోకి వచ్చినవాడినని అని.. ఇప్పుడు ఆయనతో సినిమా చేసే స్థాయికి వచ్చాను అని చెప్పడం విశేషం.

ఇక అలాంటి అభిమాని మెగాస్టార్ చిరంజీవిని మిగతా అభిమానులకు నచ్చే విధంగా ఎలా చూపిస్తాడు అనేది వేచి చూడాలి. అలాగే మరో దర్శకుడు గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇక మొత్తానికి అతను వీరసింహారెడ్డి సినిమాతో తన కలను నిజం చేసుకున్నాడు.

ఇక అతను కూడా చిన్నప్పటినుంచి బాలయ్య బాబుకు అతిపెద్ద ఫ్యాన్ అంటూ ఆయన కటౌట్ లో పెట్టి పెరిగిన వాడిని అని ఇప్పుడు ఆయన కటౌట్ కు తగ్గట్టుగా సినిమాను తెరపైకి తీసుకు వచ్చినట్లుగా చెప్పుకుంటున్నాడు.

ఏదేమైనాప్పటికీ ఇద్దరు దర్శకులు కూడా ఈ హీరోలకు వీర అభిమానులుగా హైలైట్ అయ్యారు. ఒక విధంగా ఇది ఫ్యాన్  మధ్యలో క్లాష్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ తో రెండు సినిమాలకు మంచి బజ్ అయితే పెరిగింది. మరి ఇలాంటి దర్శకులు స్టార్ హీరోలకు ఎలాంటి హిట్ ఇస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News