ప్రభాస్ హీరోయిన్ పై చీటింగ్ కేసు

Update: 2017-09-19 10:11 GMT
కొన్నాళ్లుగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ పేరు తెలుగు ప్రేక్షకుల్లో బాగానే చర్చనీయాంశమవుతోంది. అందుకు ప్రధాన కారణం ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’లో ఆమే కథానాయిక కావడం అనడంలో సందేహం లేదు. మరోవైపు హైదరాబాదీ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవిత కథతో తెరకెక్కే సినిమాలోనూ ఆమె నటించబోతోంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన పాజిటివ్ వార్తలతో చర్చనీయాంశమవుతున్న శ్రద్ధా.. ఇప్పుడు ఓ ప్రతికూల విషయంతో వార్తల్లోకి వచ్చింది. ఆమెపై ముంబయిలో చీటింగ్ కేసు నమోదైంది. తన కొత్త సినిమా ‘హసీనా పార్కర్’కు సంబంధించిన ఓ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘింనందుకు శ్రద్ధాపై కేసు నమోదైంది.

‘హసీనా పార్కర్’ సినిమా అంతగా తమ సంస్థకు చెందిన దుస్తులే ధరించేలా.. అలాగే సినిమా ప్రమోషన్లలోనూ తమ బ్రాండును ప్రమోట్ చేసేలా శ్రద్ధా ఒప్పందం చేసుకుందని.. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రమోషన్లలో వేరే దుస్తులు వేసుకుందని ఏజే మిస్త్రీ అండ్ తియా మిన్హాస్ సంస్థ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి శ్రద్ధాతో పాటు చిత్ర నిర్మాతల మీదా ఆ సంస్థ ముంబయి కోర్టులో దావా వేసింది. అక్టోబరు 26న ఈ కేసు బెంచ్ ముందుకు రానుంది. ఈ కేసు విషయమై శ్రద్ధా ఏమీ స్పందించలేదు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి జీవిత కథ ఆధారంగా ‘హసీనా పార్కర్’ సినిమా తెరకెక్కడం విశేషం. ఈ చిత్రం బాలీవుడ్లో ముందు నుంచి హాట్ టాపిక్ అవుతోంది. రామ్ చరణ్ తో ‘జంజీర్’ తీసిన అపూర్వ లఖియా రూపొందించిన ఈ చిత్రం ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Tags:    

Similar News