ఈగోస్ ని హ‌ర్ట్ చేయకుండా మైత్రీ వారు భ‌లే మ్యానేజ్ చేశారే?

Update: 2023-01-07 05:43 GMT
ఇద్ద‌రు స్టార్స్ ని మేక‌ర్స్ ఒకే సారి సాటిస్ ఫై చేయ‌డం, వారి ఫ్యాన్స్ ఈగోని హ‌ర్ట్ చేయ‌కుండా మ్యానేజ్ చేస్తూ వారిని హ్యాపీగా వుంచ‌డం అంత ఈజీ కాదు. ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా నెట్టింట ప‌రువుపోతోంది. ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తారు. హీరోలు హ‌ర్ట్ అయిపోతారు. దీంతో అనుకున్న‌దొక‌టి అయ్యింది ఒక‌టి అన్న‌ట్టుగా ప‌రిస్థితి త‌ల‌కిందులుగా మారిపోతూ వుంటుంది. కానీ ఈ విష‌యాన్ని ముందే ప‌సిగ‌ట్టిన‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ప‌క్కా ప్లానింగ్ తో ఇద్ద‌రు హీరోల‌ని, వారి అభిమానుల్ని మ్యానేజ్ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. ఈ సంక్రాంతికి ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ పోటీ పోటీగా రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన మాసీవ్ యాక్ష‌న్ డ్రామా 'వాల్తేరు వీర‌య్య‌' జ‌న‌వ‌రి 13న విడుద‌ల కాబోతోంది. బాబి డైరెక్ట్ చేస్తుండ‌గా మాస్ మ‌హారాజ ర‌వితేజ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని మై్రీ వారు నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ మూవీతో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'వీర సింహారెడ్డి' రిలీజ్ కాబోతోంది. గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని జ‌న‌వ‌రి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులోనూ హీరోయిన్ గా శృతిహాస‌న్ న‌టిస్తోంది. మ‌రో కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ హీరోయిన్ హ‌నీరోజ్ క‌నిపించ‌బోతోంది. ఈ మూవీని కూడా మైత్రీ  మూవీ మేక‌ర్స్ వారే నిర్మించ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే ఈ రెండు సినిమాల విష‌యంలో మైత్రీవారు అవ‌లంభించిన ప్లాన్ ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఒకే సంస్థ ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కుల‌తో సినిమాలు నిర్మించ‌డం.. వాటిని ఒకేసారి రిలీజ్ చేయ‌డం అన్న‌ది మామూలు విష‌యం కాదు. ప‌క్కాగా చెప్పాలంటే అదొక బిగ్ టాస్క్‌. హీరోల ఈగోని హ‌ర్ట్ చేయ‌కుండా ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేయాలి.

అదే స‌మ‌యంలో ఇద్ద‌రు హీరోల అభిమానులు కూడా హ‌ర్ట్ కాకుండా చూసుకోవాలి. ఏచిన్న పొర‌పాటు దొర్లినా ఫ్యాన్స్ చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. కంపు కంపు అయిపోతుంది. అయితే సంక్రాంతి బ‌రిలో ఒక్క రోజు లేడాలో రెండు భారీ సినిమాల‌ని రిలీజ్ చేస్తున్న మైత్రీవారు ఎక్క‌డా ఇద్ద‌రు హీరోల ఈగోలు హార్ట్‌ కాకుండా అదే స‌మ‌యంలో ఫ్యాన్స్ కూడా ఫీల‌వ‌వ్వ‌కుండా ప్ర‌మోష‌న్స్ ని హోరెత్తించారు.

వారి ప్లానింగ్‌ తీరుని చూసిన వారంతా భ‌లే మ్యానేజ్ చేశారే అని అవాక్క‌వుతున్నారు. మైత్రీ నిర్మాత‌లు న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఈ విష‌యంలో ఎక్స్ ప‌ర్ట్స్ అనిపించుకున్నారు. ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో ఏక కాలంలో సినిమాలు చేయ‌డ‌మే కాకుండా ఒకే సమ‌యంలో రిలీజ్ చేస్తూ ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీలు త‌లెత్త‌కుండా సాఫీగా సినిమాల‌ని రిలీజ్ చేస్తున్న తీరుకు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అవాక్క‌వుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News