JGMపై విజ‌య్ దేవ‌ర‌కొండ‌ తేల్చేశాడా?

Update: 2022-09-12 05:26 GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లేటెస్ట్ మూవీ 'లైగ‌ర్‌'. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించారు. ఈ మూవీ రిలీజ్ కి ముందు రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేర‌పోతాన‌ని, బాలీవుడ్ లోనూ పాగా వేస్తాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. అందుకే ఈ మూవీ కోసం దాదాపు రెండేళ్ల‌కు పైనే కేటాయించాడు. దేశ వ్యాప్తంగా సినిమా రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్నాడు.

దీంతో ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది. కానీ రిలీజ్ త‌రువాత మాత్రం సీన్ రివ‌ర్స్ అయింది. భారీ హైప్ క్రియేట్ అయిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో లేకపోవ‌డంతో ప్రేక్ష‌కులు సినిమాని తీర‌స్క‌రించారు. దీంతో 'లైగ‌ర్‌' ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకే డిజాస్టార్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో నెటిజ‌న్ లు విజ‌య్ దేవ‌క‌ర‌కొండ తో పాటు పూరిని, ఛార్మీని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. సినిమాని ట్రోల్ చేశారు. దీంతో టీమ్ మొత్తం సైలెంట్ అయిపోయింది.

ఒక్క ఛార్మీ మాత్ర‌మే రూమ‌ర్స్ కి రిప్ అంటూ ఘూటుగా స్పందించింది. మ‌ళ్లీ రెట్టించిన ఉత్సాహంతో బౌన్స్ బ్యాక్ అవుతామ‌ని, అంత వ‌ర‌కు కాస్త బ్ర‌త‌క‌న‌వ్వండి అంటూ ట్రోల‌ర్స్ పై మండిప‌డింది. ప్ర‌దీ విష‌యంలోనూ అగ్రెసీవ్ గా స్పందించే విజ‌య్ దేవ‌ర‌కొండ 'లైగ‌ర్‌' డిజాస్ట‌ర్ కావ‌డంతో సైలెంట్ అయిపోయాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎలాంటి పోస్ట్ లు షేర్ చేయ‌క‌పోవ‌డంతో విజ‌య్ ఎలా స్పందిస్తాడా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

'లైగ‌ర్‌' డిజాస్ట‌ర్ నేప‌థ్యంలో పూరితో విజ‌య్ దేవ‌ర‌కొండ చేస్తున్న 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' ఆగిపోయింద‌ని వార్త‌లు వినిపిస్తున్న‌ప విష‌యం తెలిసిందే. దీనిపై కూడా అటు పూరి కానీ, ఛార్మీ కానీ స్పందించ‌లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి దీనిపై క్లారిటీ ఏమైనా వ‌స్తుందేమో అంటూ మీడియా, ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బెంగ‌ళూరులో జ‌రిగిన సైమా అవార్డుల ఫంక్ష‌న్ లో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ద‌త్య‌క్ష‌మ‌య్యాడు.

సైమా ప‌ద‌వి వార్షికోత్స‌వ వేడుక‌లు బెంగ‌ళూరులో భారీగా జ‌రిగాయి. ఈ వేడుల‌క‌లో ప‌లువురు స్టార్స్ పాల్గొన్నారు. అందిరితో పాటు రౌడీ స్టార్ విజ‌య్ తేవ‌ర‌కొండ కూడా పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా మీడియా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' గురించి ప్ర‌శ్రించింది.

ఈ ప్ర‌శ్న‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ ఊమించ‌ని విధంగా స‌మాధానం చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌నం వ‌చ్చింది సైమా వేడుక‌ల్ని ఎంజాయ్ చేయ‌డానికి దానికే ప‌రిమిత‌మ‌వుతాం' అంటూ స‌మాధానం చెన‌ప్న‌డంతో  'జ‌న‌గ‌ణ‌మ‌న‌'ని వ‌దిలేశాన‌ని రౌడీ స్టార్ ఇండైరెక్ట్ గా స్ప‌ష్టం చేశాడ‌ని అంటున్నారు. ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News