బాల‌య్య త‌ర్వాత ఎన్టీఆర్ తో గీతా సినిమాలు!

Update: 2022-02-03 04:30 GMT
ఆహా-ఓటీటీకి ఎన్బీకే-అన్ స్టాప‌బుల్ ఎంత బిగ్ బూస్ట్ నిచ్చిందో తెలిసిందే. ఆ క్ర‌మంలోనే నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అల్లు అర‌వింద్ బాండింగ్ మ‌రింత బ‌ల‌ప‌డింది. బాల‌య్య హీరోగా గీతా ఆర్ట్స్ లో ఓ సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది.

ఇంత‌లోనే గీతా ఆర్ట్స్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమాకి స‌న్నాహ‌కాలు సాగుతున్నాయ‌న్న టాక్ వినిపిస్తోంది. స‌ర్కార్ వారి పాట త‌ర్వాత ప‌ర‌శురామ్ తెర‌కెక్కించే చిత్రం ఇదే అవుతుంద‌ట‌. తార‌క్ - ప‌ర‌శురామ్ ని క‌లిపి గీతా ఆర్ట్స్ సోలో బిగ్ హిట్ కొట్టాల‌నుకుంటోంద‌ట‌. నిజానికి మ‌హేష్ తో గీతా సంస్థ‌లో ఓ సినిమా చేయాల్సి ఉన్నా కుద‌ర‌లేదు. అటుపై అల్లు అరవింద్.. హారిక అండ్ హాసినితో క‌లిసి అల వైకుంఠపురంలో సినిమాని తెర‌కెక్కించారు.

ఇప్పుడు గీత గోవిందం ఫేం ప‌ర‌శురామ్ తో ఎన్టీఆర్ ని క‌లిపి సినిమా తీయాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం. ఇది ఫైన‌ల్ అయితే గ‌నుక‌ గీతా కాంపౌండ్ లో యంగ్ టైగర్ కి అదే మొదటి చిత్రం అవుతుంది. తార‌క్ రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ జీఏ సంస్థ‌తో ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఎలాగైనా అత‌డితో చేయాల‌ని అల్లు అర‌వింద్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏది ఏమైనా బాల‌య్య .. తార‌క్ ల‌తో గీతా ఆర్ట్స్ సినిమాల్ని నిర్మించే ప్లాన్ చేయ‌డం అభిమానుల్లో ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

Tags:    

Similar News