నాతో పెళ్లి ఆయనకు రెండోసారి అంటున్న డ్రీమ్‌గర్ల్

Update: 2020-04-07 23:30 GMT
అలనాటి బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమా మాలిని పెళ్లై పిల్లలున్న ధర్మేంద్రతో ప్రేమాయణం సాగించిందట. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఫుల్ కోటింగ్ ఇచ్చారట. ఇలా వదిలేస్తే లాభం లేదని మరో హీరో జితేంద్ర కుటుంబ సభ్యులతో మాట్లాడి అతడితో పెళ్లికి ఏర్పాట్లు చేశారట. తల్లిదండ్రుల మాటకి ఒప్పుకుని తల వంచి తాళి కట్టించు కోవాలనుకుంది హేమా మాలిని. కానీ అప్పటికే జితేంద్ర కూడా శోభా కపూర్ అనే ఆవిడతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. అయినా సరే హేమను చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. చెన్నైలో పెళ్లి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈ పెళ్లి విషయాన్ని పేపర్లో చూసేంత వరకు దర్మేంద్రకు, శోభకు తెలియక పోవడం గమనార్హం. వార్త చదివిన వెంటనే ధర్మేంద్ర, శోభ చెన్నై బయలుదేరి వెళ్లారు.

ఆ సమయంలో జితేంద్ర, హేమ కుటుంబ సభ్యుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారట. ధర్మేంద్ర హేమతో తనకు అన్యాయం చేయవద్దంటూ బతిమలాడాడట. దీంతో పెళ్లికి మరి కొంత టైమ్ కావాలని హేమ తన కుటుంబ సభ్యులను వేడుకుంది. ఇంకేముంది జితేంద్ర, హేమల పెళ్లి వాయిదా పడింది. ఆ తరువాత హేమ, ధర్మేంద్ర కలిసి నటించిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్టవ్వడం తో వీరి ప్రేమ మరింత గాఢంగా మారింది. అనంతరం 1979 ఆగస్టు 21న హేమను రెండో భార్యగా చేసుకున్నాడు ధర్మేంద్ర. అటు జితేంద్ర పెళ్లి 1974 అక్టోబర్ 18న తను ప్రేమించిన శోభా కపూర్‌తో అయింది. ఈ విషయాలన్నీ "హేమా మాలిని: బియాండ్ ద డ్రీమ్‌గర్ల్" అనే పుస్తకంలో రాసుకొచ్చారు. మొత్తానికి ఇంత విషయం జరిగిందన్నమాట డ్రీంగర్ల్ మ్యారేజ్ వెనుక అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
Tags:    

Similar News