మెగాస్టార్ స‌రికొత్త ప్లాన్ ఇదేనా?

Update: 2022-08-03 11:30 GMT
మెగాస్టార్ చిరంజీవి సరికొత్త ప్లాన్ తో ముందుకెళ్లాల‌నుకుంటున్నార‌ట‌. దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత 'ఆచార్య‌' మూవీతో ఆయ‌న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై డిజాస్ట‌ర్ గా నిలిచింది. రెండేళ్లుగా ఆశ‌గా చిరు మూవీ కోసం ఎదురుచూసిన‌ అభిమానుల్ని తీవ్రంగా నిరాశ ప‌రిచింది. రామ్ చ‌ర‌ణ్ , చిరు క‌లిసి న‌టించిన తొలి సినిమాగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చినా స‌రైన కంటెంట్ లేక‌పోవ‌డంతో ఈ మూవీని ప్రేక్ష‌కులు తిరస్క‌రించారు.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత మెగాస్టార్ స‌రి కొత్త నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. 'ప్రాణం ఖ‌రీదు' నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేసిన మెగాస్టార్ ఇక‌పై యంగ్ డైరెక్ట‌ర్ల‌తో మాత్ర‌మే క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇందులో భాగంగా కొన్ని ప్రాజెక్ట్ ల‌ని ప్ర‌స్తుతం ప‌క్క‌న పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ బిజీగా వున్న విష‌యం తెలిసిందే.

మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫ‌ర్' ఆధారంగా రూపొందుతున్న 'గాడ్ ఫాద‌ర్'లో న‌టిస్తున్నారు. ఈ మూవీని మోహ‌న్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ద‌స‌రాకు విడుద‌ల కానున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

ఇక మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్‌లోనూ ఓ మూవీ చేస్తున్నారు. ఇది త‌మిళ సూప‌ర్ హిట్ సినిమా 'వేదాళం' ఆధారంగా రీమేక్ అవుతోంది. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో చిరుకు జోడీగా త‌మ‌న్నా న‌టిస్తుంటే సోద‌రిగా కీర్తి సురేష్ కనిపించ‌నుంది.

ఇక డైరెక్ట‌ర్ బాబితో 'వాల్తేరు వీర‌య్య‌' మూవీ చేస్తున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్నారు. వీటి త‌రువాతే యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ తో పాటు మారుతి ప్రాజెక్ట్ వుంటాయ‌ట‌.

ఆ త‌రువాత కూడా యంగ్ డైరెక్ట‌ర్ల‌తో వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని చిరు నిర్ణ‌యించుకున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. ముందు అంగీక‌రించిన ప్రాజెక్ట్ లు పూర్త‌య్యాక యంగ్ డైరెక్ట‌ర్ల‌తో వ‌రుస‌గా చిరు సినిమాలు చేయ‌బోతున్నార‌ని తెలిసింది.
Tags:    

Similar News