జబర్దస్త్‌ స్కెచ్‌.. చెల్లిని రంగంలోకి దించనున్న రంగమ్మత్త

Update: 2022-10-21 14:30 GMT
జబర్దస్త్‌ కామెడీ షో తో అనసూయకు హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ దక్కింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌ గా కాకున్నా ప్రస్తుతం వరుసగా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల కోసం అనసూయను సంప్రదిస్తున్న వారు చాలా మంది ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా పుష్ప సినిమా తో పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ మరింత బిజీగా మారింది.

సినిమాలతో బిజీ అవ్వడం వల్ల జబర్దస్త్‌ కార్యక్రమంను వీడి వెళ్లబోతున్నట్లుగా ప్రకటించింది.. ఇప్పటికే ఆమె జబర్దస్త్‌ కి దూరం అయిన విషయం కూడా తెల్సిందే. ఈటీవీ ని వీడిన తర్వాత మా టీవీలో కనిపిస్తుందని అంతా భావించారు. కానీ అక్కడ కూడా పెద్దగా కనిపించడం లేదు. దాంతో మళ్లీ ఈమె బుల్లి తెరపై కనిపించబోతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలో అనసూయ తన వారసురాలిగా చెల్లి వైష్ణవి ని బుల్లితెరపై పరిచయం చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె కూడా తెలుగు లో బాగా మాట్లాడగలదు. అంతే కాకుండా గతంలో అనసూయతో పాటు జబర్దస్త్‌ లో కూడా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత టీవీ లో వైష్ణవి కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అనసూయ తనకు ఉన్న పరిచయాల ద్వారా చెల్లికి ఆఫర్ అయితే ఇప్పించిందట. మరి ఆ ఆఫర్ ను వైష్ణవి ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటుంది అనేది చూడాలి. బుల్లి తెరపై అక్క స్థాయిలో వైష్ణవి సత్తా చాటుతుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News