శ్రీదేవితో పోల్చడంతోనే అస‌లు తంటా!

Update: 2022-08-08 04:08 GMT
బాలీవుడ్ లో ఒక్కో  మెట్టు ఎక్కుతోంది జాన్వీ కపూర్. ఓవైపు న‌టిగా గుర్తింపు తెచ్చే పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూనే గ్లామ‌రస్ నాయిక‌గా త‌న‌ను తాను ఫోక‌స్ చేసుకునేందుకు తాప‌త్రాయ ప‌డుతోంది. ఉత్త‌రాదిన వ‌రుస‌గా యువ‌హీరోల స‌ర‌స‌న న‌టిస్తున్న జాన్వీ త్వ‌ర‌లోనే టాలీవుడ్ లో ప్ర‌వేశించాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర వేసిన జాన్వీ ఇటీవల విడుదలైన గుడ్ లక్ జెర్రీ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో క‌నిపిస్తోంది. మూవీలో కొత్త అవతారంతో జాన్వీ ఆక‌ట్టుకుంద‌ని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. సినిమాలో ఆమె నటనను అభిమానులు ఇష్టపడుతున్నారు. జాన్వీ తన తల్లి శ్రీదేవిని ఎంతగా ప్రేమిస్తుందో.. త‌న‌తో ఎంత సన్నిహితంగా ఉండేదో దాచ‌డం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మామ్ శ్రీదేవి గురించి ఆమె నుండి ఆమె వారసత్వంగా పొందిన లక్షణాల గురించి ఓపెనైంది. తాను లైఫ్ లో ఎక్కువగా మిస్ అవుతున్న వాటి గురించి వెల్ల‌డించింది.

శ్రీదేవి నుంచి త‌న‌కు ఎలాంటి లక్షణాలు లేదా నైపుణ్యాలు సంక్రమించాయన్న ప్రశ్నకు జాన్వీ కపూర్ సమాధానమిస్తూ.. తనకు చిత్రలేఖనమంటే ఇష్టమని బదులిచ్చారు. సెట్స్ లో విరామ సమయంలో స్కెచింగ్ చేస్తాన‌ని వెల్లడించింది. నిజానికి జాన్వి తన కళ్ళు శ్రీదేవి క‌ళ్ల‌ను పోలి ఉంటాయ‌ని.. ఆమె గొంతును కూడా పోలి ఉంటాయని ప్రజలు భావిస్తున్నారని కూడా తెలిపింది.

శ్రీదేవి గురించి ప్ర‌శ్నించ‌గా.. మామ్ ను మిస్ అవుతున్నానని ఆవేద‌న క‌న‌బ‌రిచింది. శ్రీదేవి నిద్ర లేచే వరకు తాను మంచం దిగేదానిని కాద‌ని జాన్వీ త‌న లేజీ మార్నింగ్స్ గురించి వెల్లడించింది. త‌న‌ అలారం మోగుతుంది కానీ మామ్ శ్రీ‌దేవిని పిలుస్తుంది. ఆమె ముఖం చూడకుండా తన గది నుండి బయటకి అడుగు పెట్టదు. మామ్ కు గుడ్ నైట్ చెప్పకుండా నిద్రపోదు... అంత‌టి అన‌బంధం శ్రీ‌దేవితో ఉండేది.

శ్రీదేవి కూతురైనందున త‌న‌పై వచ్చిన విమర్శల గురించి వెల్ల‌డించింది. ప్రజలు నా మొదటి నాలుగు చిత్రాలను మామ్ న‌టించిన‌ 300 చిత్రాలతో పోల్చుతున్నారు. నాకు మరేదీ తెలియదు కానీ నేను ఈ వృత్తిని మామ్ కోసం చేయాలనుకుంటున్నాను. నామ్ తో రోషన్ కర్నా హీ పడేగా (నేను ఆమెను గర్వపడేలా చేయాలి). నేను అలా మ‌ధ్య‌లో వదిలేయలేను... అని కూడా జాన్వీ ఎమోష‌న‌ల్ అయ్యింది.

ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ విజయాన్ని ఆస్వాదిస్తున్న జాన్వీ త‌దుప‌రి బావాల్ షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. ఇటీవల వరుణ్ ధావన్ తో `బవాల్` అంతర్జాతీయ షూట్ షెడ్యూల్ నుండి అనేక ఫోటోలను జాన్వీ పంచుకుంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహించారు.  సాజిద్ నడియాద్వాలా స‌మ‌ర్పిస్తున్నారు. ఇది కాకుండా నిర్మాత కం డాడ్ బోనీ కపూర్ తో క‌లిసి జాన్వీ `మిలీ` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ ఏడాదిలోనే జాన్వీ తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఆరంగేట్రం చేయ‌నుంద‌ని స‌మాచారం. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లేదా విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించేందుకు ఎంతో ఉత్సాహం క‌న‌బ‌రుస్తోంది.
Tags:    

Similar News