గుమ్మడికాయ కొట్టారని భారీ రిలీఫ్

Update: 2019-12-28 05:18 GMT
చిత్రం ఏదైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఉండే ఉత్సాహం.. గుమ్మడికాయ కొట్టే వేళకు భావోద్వేగానికి గురయ్యేలా చేస్తుంది. అరే.. అంత త్వరగా షూటింగ్ అయిపోయిందే.. మరికొంత కాలం సాగితే బాగుండేదే? అన్నట్లుగా ఫీల్ కావటం సహజం. గుమ్మడికాయ కొట్టినంతనే ఏదో మిస్ అయ్యామన్న భావన చాలా యూనిట్ సభ్యుల్లో కలుగుతుంది. ఇంతకాలం కలిసి పని చేసి.. ఇప్పుడు ఎవరి దారిన వారన్నట్లుగా ఉండటాన్ని త్వరగా జీర్ణించుకోలేరు.

ఇందుకు భిన్నమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తున్నారు జాన్వీ కపూర్. ఎంట్రీలోనే భారీ సక్సెస్ అందుకున్న ఆమె.. అనూహ్యంగా వెబ్ సిరీస్ చేయాలని డిసైడ్ అయి సంచలనంగా మారారు. ప్రస్తుతం ఆమె హార్ అంథాలజీ ఘోస్ట్ స్టోరీస్ లో చేశారు. ఈ సిరిస్ నాలుగు భాగాలుగా ఉంటే.. అందులో ఒకదాన్లో జాన్వీ నటించారు. ఆమె చేసిన పార్ట్ కు జోయా అక్తర్ దర్శకత్వం వహించారు.

తాజాగా షూటింగ్ పూర్తి కావటంపై జాన్వీ రిలాక్స్ అవుతున్నారు. ఎందుకంటే షూటింగ్ వేళ తాను చాలా భయపడినట్లుగా పేర్కొన్నారు. షూటింగ్ పూర్తి అయ్యే లోపు తమలోని పది మందిలో ఎనిమిది మంది అనారోగ్యం బారిన పడిన వైనాన్ని చెప్పారు. షూటింగ్ చేసిన సమయంలో తనను ఎవరో ఆవహించినట్లుగా ఉండేదన్నారు. షూట్ అయిపోయిన వెంటనే ఎవరో వదిలేసిన అనుభూతికి లోనైనట్లుగా ఆమె చెప్పారు. షూట్ వేళలోనే ఇంతలా భయపెడితే.. దీన్ని చూసే వారెంత భయానికి గురి అవుతారో?


Tags:    

Similar News