ఫార్టీప్లస్ లో మళ్లొస్తున్న మెరుపుకలలు బ్యూటీ

Update: 2016-12-01 22:30 GMT
బాలీవుడ్ బ్యూటీ కాజోల్.. సౌత్ఇండియాలో చేసిన ఒకే ఒక్క సినిమా మిన్సార కణవు. 1997లో వచ్చిన ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ దర్శకుడు కాగా..తెలుగులో మెరుపు కలలు అంటూ రిలీజ్ అయింది. అరవింద్ స్వామి.. ప్రభుదేవాలు మెరుపుకలలు చిత్రంలో హీరోలుగా నటించారు.

అజయ్ దేవగన్ తో పెళ్లయిపోయినా.. ఇప్పటికి 42ఏళ్ల వయసును అందుకున్నా ఇంకా తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తోంది కాజల్. 19 ఏళ్ల తర్వాత తిరిగి కోలీవుడ్ లో అడుగు పెట్టనుందిట. ధనుష్ హీరోగా నటించనున్న వీఐపీ2 చిత్రంలో నటించేందుకు కాజోల్ సై అన్నట్లు తెలుస్తోంది. రజినీ కూతురు సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుంది. ఈ మూవీ స్టోరీని స్వయంగా కాజోల్ కి వినిపించిందట సౌందర్య. సినిమా గురించి.. స్టోరీ గురించి వినగానే వెంటనే ఈ మూవీ చేసేందుకు అంగీకరించిందిట కాజోల్.

బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్న కాజోల్ కు.. ధనుష్ తో మంచి ర్యాపో ఉంది. అలా ఈ మూవీలో చేసేందుకు ఒప్పించాడట  దర్శకుడు. ధనుష్-కాజోల్ ల పెయిర్ అద్భుతంగా ఉంటుందని. ఇద్దరు ట్యాలెంటెడ్ నటులు ఒకేసారి స్క్రీన్ పై కనిపించనుండడం.. అది కూడా వీఐపీ లాంటి చిత్రానికి సీక్వెల్ కావడంతో.. ఆలోచనల దశల్లోన ప్రాజెక్టు క్రీజీగా మారిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News