సూసైడ్ గ్యాంగ్ ఇప్పుడు రియాని బలిపశువుని చేస్తుందా..?

Update: 2020-07-29 15:30 GMT
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజంపై గత కొద్దికాలంగా యుద్ధం చేస్తోన్న హీరోయిన్ కంగనా రనౌత్.. సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్‌ మరణాంతరం తన స్వరాన్ని మరింతగా పెంచింది. బాలీవుడ్‌ లోని కొందరు ప్రముఖుల పేర్లను బయటపడుతూ మూవీ మాఫియాగా పేర్కొంది. కరణ్ జోహార్ - ఆదిత్య చోప్రా - మహేష్ భట్ - జావేద్ అక్తర్‌ లు మాఫియాగా మారారని.. వారే సుశాంత్ కెరీర్‌ ను నాశనం చేశారని ఆరోపించింది. సుశాంత్‌ కు ఎన్నో సమస్యలు సృష్టించి మానసికంగా కృంగదీసి సూసైడ్ చేసుకునేలా చేసారని విమర్శించింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులను తప్పితే బయటవారిని ఎదగనివ్వరని కంగనా కామెంట్ చేసింది. అంతేకాకుండా సుశాంత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసుల పనితీరుపై కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. ఇప్పుడు సుశాంత్ సింగ్ తండ్రి ఫిర్యాదుతో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో కంగనా అండ్ టీమ్ వరుస ట్వీట్స్ పెడుతూ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.

కాగా ట్వీట్ చేస్తూ.. ''రియా - సుశాంత్ ల యొక్క రిలేషన్షిప్ ఒక సంవత్సరం కన్నా తక్కువ. సుశాంత్ ఆమెపైనే తన నమ్మకాన్ని ఉంచాడు. అతను బయటి ప్రపంచాన్ని చూసి భయపడ్డాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఏదైనా చేయాలనుకున్నాడు. ఆమెను అతను కలిసినప్పటికే కృంగిపోయున్నాడు. ఆమె చాలాకాలంగా ఉన్న అతనిపై వేధింపులను అడ్వాంటేజ్ గా తీసుకుంది. ఇంతక ముందే కంగనా చెప్పినట్లు అతని కెరీర్ ని రెప్యుటేషన్ ని తగ్గించి అతన్ని మానసికంగా హతమార్చరారు'' అని పేర్కొంది. మరో ట్వీట్ చేస్తూ.. ''ఖచ్చితంగా రియా ఒక బంగారు త్రవ్వకం. కాని సుశాంత్ ఆమెకు ఉన్న ఏకైక ఆదాయ వనరు. అతని హత్య తరువాత ఆమె అక్తర్స్ ని కలవడానికి ఎందుకు పరుగెత్తింది? సుశాంత్ ని చంపడానికి ఆమెకు సరైన కారణం ఉందా? లేక మాఫియా ఆమెను ఉపయోగించారా? సూసైడ్ గ్యాంగ్ ఇప్పుడు ఆమెను బలిపశువుగా చేస్తుందా?'' అని రియా చక్రవర్తి ఫర్హాన్ అక్తర్ ఇంటికి వెళ్లినప్పటి ఫోటో స్క్రీన్ షాట్స్ మరియు మహేష్ భట్ ని కౌగిలించుకున్న ఫోటోలను జత జేసింది కంగనా.
Tags:    

Similar News