అమ్మో కరణ్‌.. నీ గ్రూపుకు వేసుకున్నావా??

Update: 2017-04-28 10:46 GMT
''సూపర్ స్టార్ వినోద్ ఖన్నా మరణించారు కాబట్టి.. ఈరోజు సాయంత్రం బాహుబలి 2 ప్రీమియర్ వేయబోవట్లేదు'' అంటూ మీడియాక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు కరణ్‌ జోహార్. అబ్బా వావ్ అనుకునేలోపే.. తన గ్రూపుతో కలసి హ్యాపీగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశాడు. ఇంతకీ అసలు గత రాత్రి ముంబయ్ లో ఏం జరిగింది?

మీడియాతో కలసి.. చాలామంది సెలబ్రిటీలో సమక్షంలో.. గత రాత్రి ముంబయ్ లో జరగాల్సిన ప్రీమియర్ సో క్యాన్సిల్ అయ్యింది. అయితే ఈ షో క్యాన్సిల్ అయినప్పటికీ.. కరణ్‌ జోహార్ తన ఆప్తులకు అప్పటికప్పుడు యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో ఉన్న ప్రివ్యూ ధియేటర్లో స్పెషల్ షో ఏర్పాటు చేయించాడు. కరణ్‌ తో పాటు మన రానా దగ్గుబాటి.. హీరోయిన్ ఆలియా భట్.. అలాగే రవీనా టాండన్.. ఆమె భర్త అనిల్ తడాని (బాహుబలి హిందీ వర్షన్ పార్టనర్ లే ఆయన) వంటి దగ్గర వారందరికీ ఈ ప్రీమియర్ వేశారు.

మొత్తానికి వినోద్ ఖన్నా చనిపోతే మీడియా వాళ్ళకు ప్రీమియర్ క్యాన్సిల్ అయ్యింది కాని.. కరణ్‌ అండ్ కో బాగానే ఎంజాయ్ చేసింది గురూ.

Image Courtesy: Mid-day.com

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News