పిక్ టాక్‌ : నీళ్లు.. మంటతో హాట్ బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్‌

Update: 2021-09-23 01:30 GMT
స్టార్స్ బర్త్‌ డే అయినా మరే చిన్న అకేషన్ ను అయినా చాలా రిచ్ గా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క సందర్బంను కూడా పూర్తిగా ఎంజాయ్ చేసే ఉద్దేశ్యంతో చాలా స్పెషల్‌ గా ప్లాన్ చేస్తూ ఉంటారు. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను దక్కించుకున్నా.. మరే సందర్బంలో అయినా కూడా పార్టీలు అనేవి చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. కాని కొందరు చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీలు సోషల్‌ మీడియాలో టాపిక్ అవుతాయి. తాజాగా సోషల్‌ మీడియాలో కరీనా కపూర్‌ ఖాన్ బర్త్‌ డే వేడుకకు సంబంధించిన ఫొటో వైరల్‌ అయ్యింది. బీచ్ లో సముద్రపు ఒడ్డున అత్యంత బ్యూటీఫిల్ లొకేషన్ లో కరీనా కపూర్‌ బర్త్‌ డే చాలా స్పెషల్‌ గా చేసుకుందని ఈ ఫొటో చూస్తుంటేనే అర్థం అవుతోంది.

ఇద్దరు కొడుకులు మరియు భర్త సైఫ్‌ అలీ ఖాన్ లు బీచ్ లు చాలా అందమైన సమయంలో గడిపారు. నీటితో పాటు మంటను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంటతో హ్యాపీ బర్త్‌ డే అంటూ అక్షరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ బర్త్‌ డే చాలా స్పెషల్‌ అయ్యింది. మొత్తానికి ఈ బర్త్‌ డే వేడుక నీరు మరియు నిప్పు అన్నట్లుగా స్పెషల్‌ గా నిలిచిందని.. ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి కాన్సెప్ట్‌ ను ఆలోచించలేదు. చాలా బ్యూటీఫుల్ గా ఉన్న ఈ పిక్ ను నెటిజన్స్ తెగ లైక్‌ చేస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన కరీనా కపూర్‌ ఖాన్ ను మరియు సైఫ్ అలీ ఖాన్‌ వయసు పెరిగి పోయినా కూడా అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు. వారంతా కూడా ఈ స్పెషల్‌ బర్త్‌ డే స్పెషల్‌ కు ఫిదా అవుతున్నారు.

41వ బర్త్‌ డే వేడుక ను కరీనా తన భర్త సైఫ్ అలీ ఖాన్ మరియు కొడుకులు తైమూర్ ఇంకా జెహ్ లతో ఒక ద్వీపం లో చేసుకుంది. అక్కడ అత్యంత ప్రశాంతంగా ఎవరు కనీసం డిస్ట్రబ్ కూడా చేయని విధంగా ఏర్పాట్లు చేసుకుని సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ ప్రత్యేక బర్త్‌ డే వేడుక తో కరీనా చాలా హ్యాపీ ఫీల్‌ అయ్యింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. రెండవ బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కరీనా కపూర్ ఖాన్‌ మళ్లీ నటించేందుకు సిద్దం అయ్యింది. పెళ్లి మరియు పిల్లల తర్వాత సినిమాలకు దూరం అయిన వారు చాలా మంది ఉన్నారు. కాని ఈమె మాత్రం తన సినిమాలను కంటిన్యూగా చేస్తాను అనే మొదటి నుండి చెబుతోంది. సైఫ్ నుండి కూడా ఆమెకు సంపూర్ణ మద్దతు దక్కడంతో మళ్లీ బిజీ అయ్యేందుకు సిద్దం అయ్యింది.


Tags:    

Similar News