రానా రూట్లో రామ్ చరణ్?!

Update: 2022-03-31 02:30 GMT
రానా మొదటి నుంచి కూడా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. హీరో గా .. విలన్ గా .. ముఖ్యమైన పాత్రధారిగా .. నటుడిగా తనని నిరూపించే ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఆయన దూసుకుని పోతుంటాడు. ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున వెబ్ సిరీస్ ల దిశగా దృష్టి పెట్టాడు.  ప్రస్తుతం `ఆయన  'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ లో వెంకటేశ్ తో కలిసి నటిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్  మూవీ చేస్తారని అనుకుంటే, వెబ్ సిరీస్ ద్వారా పలకరించాలనుకోవడం విశేషం.

ఇప్పుడు అదే బాటలో చరణ్ కూడా అడుగులు వేయనున్నట్టుగా ఒక వార్త బలంగా వినిపిస్తోంది. ఒక బడా సంస్థవారు హాలీవుడ్ లో రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ కోసం ఒక బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకోవాలని  అనుకున్నారట. అయితే 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో చరణ్  పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. అందువలన ఆయనను తీసుకోవాలనే ఉద్దేశంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా  చెప్పుకుంటున్నారు. అయితే అందులో వాస్తవం ఎంతవరకూ ఉందనేది చూడాలి.

ప్రస్తుతం రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన నుంచి 'ఆచార్య' రానుంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమా,  ఏప్రిల్  29వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది.  ఈ సినిమాలో 'సిద్ధ' అనే ఒక పవర్ఫుల్ పాత్రలో చరణ్ కనిపించపించనున్నాడు. శంకర్ దర్శకత్వంలో ఒక  సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి  చేసుకుంది. మూడో  షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకి ' సర్కారోడు ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కియారా ఈ సినిమాలో ఆయన సరసన సందడి చేస్తోంది.

ఇక ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కథ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుందని అంటున్నారు. యూవీవీ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇక 'పుష్ప 2' తరువాత చరణ్ .. సుకుమార్ తో మరో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడట.  గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'రంగస్థలం' వంటి భారీ సినిమా  వచ్చిన సంగతి   తె లిసిందే.
Tags:    

Similar News