మ‌హేష్ ఫ్యాన్స్ కి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న'SVP' !

Update: 2022-04-13 10:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న సినిమా  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని మే లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. మ‌హేష్ ఊర మాస్ పాత్ర లో క‌నిపిస్తున్నాడ‌ని టీజ‌ర్..ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే క్లారిటీ వ‌చ్చేసింది.

మ‌హేష్ మాస్ ఫ్యాన్స్ కి  ఓ ఫీస్ట్ లాంటి సినిమాని టాక్ వినిపిస్తుంది. కొన్నాళ్ల‌గా రొటీన్ కి భిన్న‌మైన పాత్ర‌లు పోషించిన మ‌హేష్  `ఎస్ వీపీ` తో మ‌హేష్ లో మాస్ యాంగిల్ ని ఆవిష్క‌రించ‌బోతున్నార‌ని  ఆడియ‌న్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.  అయితే ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్ట‌ల్ లో ప్ర‌చురించ‌బ‌డిన `సర్కారు వారి పాట` యొక్క సారంశం మ‌హేష్ అభిమానుల‌కు  ముచ్చెమ‌ట‌లు పట్టిస్తుంది.

ఇందులో మ‌హేష్ వడ్డీ రివ‌క‌రీ ఏజెంట్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని.. ఆ క్ర‌మంలో ఓ స‌మ‌స్య రావ‌డంతో దాన్ని ప‌రిష్క‌రించ‌డానికి త‌న స్వగ్రామానికి తిరిగి వెళ్తాడ‌ని పేర్కొన‌బ‌డింది. ఒక‌వేళ అదే నిజ‌మైతే `ఎస్ వీపీ` మ‌రో సందేశాత్మ‌క సినిమా అవుతుంద‌ని అభిమానుల్లో గుబులు ప‌ట్టుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఫ్యాన్స్ మ‌హేష్ ని  వేరే లెవల్లో ఊహించుకున్నారు. ఇప్పుడు పోర్ట‌ల్ తో  ఆ అంచ‌నాలు డౌన్ అవుతున్నాయి.  

`శ్రీమంతుడు`..`భ‌ర‌త్ అనే నేను`.. మ‌హర్షి..`స‌రి లేరు నీకెవ్వ‌రు` పూర్తిగా సందేశాత్మ‌క చిత్రాలు. ఎస్ వీపీ క‌థ `మ‌హ‌ర్షి`ని పోలి ఉంద‌ని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడిదే ఆలోచ‌న ఫ్యాన్స్ లో ఆందోళ‌న రేకెత్తిస్తుంది. అయితే ఇది కేవ‌లం పోర్ట్ సారాంశం మాత్ర‌మే. అధికారికంగా యూనిట్ ఇంత వ‌ర‌కూ ధృవీక‌రించ‌లేదు.  దీంతో ఓ అభిమాని ఇదంతా ఫేక్ అని అంటున్నాడు. ఈ సారాంశం 100 శాతం ప్రామాణికంగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌దు. చాలా అస్ప‌ష్టంగా ఉంది. దీనిపై అన‌వ‌స‌ర ఆందోళన అవ‌స‌రం లేదు అని ఖండించాడు.

దీంతో  కొంత మంది ఫ్యాన్స్ కూల్ అయిన‌ట్లు తెలుస్తుంది. మ‌హేష్ సినిమా క‌మిట్ అయిన‌ప్పుడే ఇది అంద‌రికి  రీచ్ అయ్యే సినిమా అని  ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు. ఆ పాత్ర ఎంతో ఎగ్టైట్ మెంట్ ని అందిస్తుంద‌ని..అందుకే ప‌ర‌శురాం క‌థ‌ని ఒప్పుకున్న‌ట్లు తెలిపారు. మ‌రి వీట‌న్నింటికి తెర ప‌డాలంటే  మే 12 వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.  

ఇందులో మ‌హేష్ కి జోడీగా  కీర్తి స సురేష్  న‌టించింది. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే రిలీజ్ అయిన క‌ళావ‌తి పాట పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇంకా మ‌రిన్ని సింగిల్స్ తో ఈ త్ర‌యం మెప్పించ‌డానికి రెడీ అవుతుంది.   14 రీల్స్- మైత్రీ మూవీ మేక‌ర్స్- జీఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Tags:    

Similar News