మేజర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. కాస్త ముందుగానే!

Update: 2022-06-30 10:35 GMT
మేజర్ సందీప్ అన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన అడవి శేష్ మేజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. జూన్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి నిర్మాతలపై మంచి లాభాలను అందించింది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ తో కలిసి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.

నిత్యం తన జిఎంబి ప్రొడక్షన్ ను సొంత సినిమాలకు వాడుకునే మహేష్ బాబు మొదటిసారి ఒక టాలెంటెడ్ మీరు కోసం మార్కెట్లోకి దించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మేజర్ సినిమా పెట్టిన పెట్టుబడికి దాదాపు అందరికీ డబుల్ ప్రాఫిట్స్ అయితే అందించింది  డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా వరకు హ్యాపీగానే ఫీలవుతున్నారు.

ఇక సినిమా సందడి థియేటర్లో తగ్గిపోవడంతో ఇప్పుడు ఓటీటీ లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అసలైతే ఈ సినిమాను కూడా యాభై రోజుల తర్వాతనే ఓటీటీ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ 25 రోజుల అనంతరం మేజర్ సినిమాకు కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి.

దీంతో ఓటీటీలో అనుకున్న డీల్ ప్రకారం కంటే ముందుగానే విడుదల చేస్తే నెట్ ఫ్లిక్స్ నుంచి నిర్మాతలకు ఇంకాస్త ఎక్కువ ఆదాయం బచ్చే అవకాశం ఉంటుంది.కాబట్టి ప్లాన్ మార్చేసి ఇప్పుడు అడ్వాన్స్ రిలీజ్ కు సిద్ధమయ్యారు. జూలై మూడవ తేదీన నెట్ఫ్లిక్స్ లో మేజర్ సినిమా సందడి చేయబోతోంది.

మొత్తానికి ఈ సినిమాతో అడవి శేష్ అయితే తన కెరీర్ లోనే మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరోచిత పోరాటాలను మాత్రమే కాకుండా అతని జీవితానికి సంబంధించిన ఎన్నో తెలియని విషయాలను కూడా సినిమాల్లో చూపించారు.

అతని ప్రేమకథ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా చాలా బాగా హైలైట్ చేసి ప్రేక్షకుల కంటతడు పెట్టించారు. మరి ఈ సినిమా నెట్ ఫ్లెక్స్ లో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News