'మేజర్‌' రికార్డ్‌.. 88 హౌస్‌ ఫుల్‌

Update: 2022-06-03 07:30 GMT
అడవి శేష్‌ టైటిల్ రోల్‌ లో నటించిన 'మేజర్‌' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు ఈ సినిమాను సోనీ పిక్చర్స్ వారితో కలిసి నిర్మించడం జరిగింది. మహేష్‌ బాబు బ్రాండ్‌ ఇమేజ్ కారణంగా సినిమా కు మంచి హైప్ క్రియేట్‌ అయ్యింది. ఉత్తర భారతంలో కూడా రియల్‌ హీరో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ కథతో ఈ సినిమా తెరకెక్కించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుండే ఆర్మీ జవాన్‌ లకు మరియు ప్రముఖులకు ప్రీమియర్ షో లు వేయడం జరిగింది. ఈ సినిమా విడుదల సందర్బంగా సాదారణ ప్రేక్షకులకు కూడా ప్రీమియర్ షో లు వేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ముఖ్య పట్టణాల్లో ప్రీమియర్ షో లు వేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా 88 ప్రీమియర్ షో లకు హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్ నమోదు అయ్యాయట.

అన్ని ప్రీమియర్ షో ల టికెట్లు అమ్ముడు పోయాయి అంటూ యూనిట్‌ సభ్యులు స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ఒక ఇండియన్ సినిమాకు ఎప్పుడు ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదు.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా 88 ప్రీమియర్‌ షో లకు హౌస్‌ ఫుల్‌ అవ్వలేదు. ఇండియన్ సినీ చరిత్రలో మేజర్‌ నిలిచి పోయే సినిమా అవుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఈ సినిమా విడుదల అయిన ప్రతి థియేటర్ వద్ద పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తుంది. కమర్షియల్‌ మూవీ అన్నట్లుగా కాకుండా ఒక దేశ పౌరుడిగా.. మేజర్ యొక్క గొప్పతనంను.. ఆయన యొక్క త్యాగంను తెలుసుకునేందుకు సినిమా చూడాలని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మల్టీ ప్లెక్స్‌ లతో పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల వద్ద కూడా మేజర్‌ కోసం క్యూలు కట్టారు.

ప్రీమియర్ షో లకు మాత్రమే కాకుండా రెగ్యులర్‌ షో లకు కూడా దేశ వ్యాప్తంగా మంచి ఆధరణ లభిస్తుందని ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టాక్‌ వినిపిస్తుంది. అడవి శేష్‌ ఈ సినిమా లో మేజర్‌ పాత్రకు అద్బుతంగా సెట్‌ అయ్యాడు. సాయి మంజ్రేకర్ మరియు శోభితలు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమాలోని ప్రతి పాత్రను అద్బుతంగా చూపించారంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.
Tags:    

Similar News