మెగాస్టార్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా..?

Update: 2021-03-26 13:30 GMT
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ''వన్''. సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాబీ మరియు సంజయ్ కలిసి స్టోరీ అందించారు. ఇచ్చాయిస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్. శ్రీలక్ష్మి ఈ సినిమాని నిర్మించారు. ఇందులో మురళీ గోపి - జగదీష్ - అలెన్సియర్ లే లోపేజ్ - సుధీర్ కరమణ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మమ్ముట్టి కేరళ ముఖ్యమంత్రిగా కనిపించిన 'వన్' సినిమా ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'వన్' సినిమా ట్రైలర్ లో మమ్ముట్టి గెటప్, ఆయన పలికిన పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ప్రజాసేవే ధ్యేయంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఒక సాధారణ వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.. సీఎం అయ్యాక అతనికి ఎదురైన రాజకీయ సవాళ్ళు ఏంటి.. ప్రతిపక్షాల కుట్రలను తట్టుకుని తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించడానేది ఈ చిత్ర కథ. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన 'వన్' సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

ఇటీవలే 'ప్రీస్ట్' సినిమాతో సక్సెస్ అందుకున్న మమ్ముట్టి 'వన్' లో కూడా తన పాత్రకు న్యాయం చేసారని.. సినిమా మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించారని అంటున్నారు. అయితే కథగా చెప్పుకోడానికి బాగున్నా కథనం మరీ వీక్ గా ఉందని కామెంట్స్ వచ్చాయి. ఫస్ట్ హాఫ్ పూర్తిగా నిరాశ పరచగా.. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా ఓకే అనిపించిందని.. క్లైమాక్స్ మాత్రం బాగుందని టాక్ వచ్చింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా.. వైడీ సోమ సుందరమ్ సినిమాటోగ్రఫీ అందించారు.మొత్తం మీద మెగాస్టార్ మమ్ముట్టి 'వన్' చిత్రానికి యావరేజ్ రిపోర్ట్స్ వచ్చాయని అర్థం అవుతోంది.


Tags:    

Similar News