హీరోయిన్ మొహంపై తలుపేసిన కూతురు?

Update: 2017-08-29 08:01 GMT
మలయాళ నటుడు దిలీప్ ఉదంతం తెలిసిందే. ఓ మలయాళ నటి కిడ్నాప్ కేసులో భాగంగా అరెస్ట్ అయ్యాడు దిలీప్. ఈ నటుడి మొదటి భార్య.. మలయాళ నటి మంజు వారియర్ కు తాజాగా ఓ అవమానం జరిగిందంటూ అక్కడి మీడియా కోడై కూస్తోంది.

తాజాగా దిలీప్ ఇంటికి మంజు వారియర్ వెళ్లిందట. అయితే.. అక్కడ దిలీప్-మంజు వారియర్ ల కూతురు అయిన మీనాక్షి నుంచి అవమానకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందట. కన్నతల్లి మొహం మీదే మీనాక్షి తలుపు వేసేసిందంటూ చెబుతున్నారు. కిడ్నాప్ కేసు విషయంలో.. మంజు వారియర్ ప్రవర్తనను కూతురు తట్టుకోలేకపోయిందని.. అందుకే ఇలా చేసిందని అంటున్నారు. నిజానికి ఆ కిడ్నాప్ కేసు విషయంలో.. మంజు వారియర్ ను కూడా పోలీసులు విచారించారనే టాక్ ఉంది. ఈ నటి సోదరుడు కూడా విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందని మీడియా వర్గాల టాక్.  అయితే.. దిలీప్ ప్రస్తుత భార్య అయిన కావ్య మాధవన్ మాత్రం మంజు వారియర్ కు స్వాగతం పలకడం విశేషం.

తన భర్తకు మాజీ భార్య లాంటి అభ్యంతరాలు ఏమీ పెట్టుకోకుండా.. సాదరంగా స్వాగతం పలికిందట కావ్య మాధవన్. ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు తలెత్తలేదని అంటున్నారు. అయితే.. మంజు వారియర్ సన్నిహితులు మాత్రం ఈ మొత్తం స్టోరీని కొట్టి పడేస్తున్నారు. అసలు దిలీప్ ఇంటికి మంజు వారియర్ వెళ్లనే లేదని అంటున్నారు. ప్రస్తుతం ఆమె కోల్ కతాలో ఉందని.. ఆమి షూటింగ్ లో భాగంగా కొన్ని వారాలుగా కోల్ కతాను వదిలి రాలేదని చెబుతున్నారు. 
Tags:    

Similar News