బాలీవుడ్ లో మైకేల్ జాక్సన్ కూతురు

Update: 2017-04-06 07:59 GMT
బాలీవుడ్ లో ఓ సెన్సేషనల్ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్సర్ కం సింగర్ మైకేల్ జాక్సన్ కూతురు.. పారిస్ జాక్సన్ ను బాలీవుడ్ లోకి తీసుకొస్తున్నారు మేకర్స్. బాలీవుడ్ మ్యూజిక్ థీమ్ పై రూపొందనున్న మూవీలో నటించేందుకు.. ఈమెను ఇప్పటికే ఒప్పించారట కూడా.

బాలీవుడ్ భామ రిచా ఛడ్డా.. పాకిస్తానీ నటి అలీ ఫజల్ లు నటించనున్న చిత్రంలో.. పారిస్ జాక్సన్ ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు భామలు ఇప్పటికే లాస్ ఏంజెల్స్ వెళ్లి మరీ.. పారిస్ జాక్సన్ కలిసి ప్రాజెక్టు గురించి డిస్కస్ చేశారట. ఇంగ్లీష్ లో రూపు దిద్దుకోనున్న ఈ చిత్రంలో.. రెండు హిందీ పాటలు కూడా ఉంటాయని భోగట్టా. రెండు జంటల మధ్య సాగే ఈ చిత్ర కథ.. హాలీవుడ్ అండ్ బాలీవుడ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది.

పారిస్ జాక్సన్ కు జోడీగా ఓ అమెరికన్ యాక్టర్ ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. మూవీలో కీలక పాత్రలు మాత్రం రిచా ఛడ్డా.. అలీ ఫజల్ వే అంటున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాగా.. ఏప్రిల్ నెలాఖరులో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News