రీల్ లో లైఫ్ లో కూడా అదే బంధం

Update: 2018-03-20 16:26 GMT
వెండితెరపై కనిపించే నటి నటులు రియల్ లైఫ్ లో ఒక్కోసారి ప్రేమలో పడుతుండడం సహజమే. ఆ తరువాత వారు కలిసి సినిమా చేస్తే చాలా కొత్తగా అనిపిస్తుంటుంది. ఇక పెళ్లైన తరువాత కూడా కలిసి నటిస్తే ఆ కిక్కే వేరు. అయితే చాలా రోజుల తరువాత ఓ ప్రముఖ రియల్ జంట రీల్ లైఫ్ లో నిజమైన జంటగా కనిపించబోతున్నారు. వారిని చూపించబోయేది మరెవరో కాదు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.

పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరితో మెహబూబా అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దాదాపు సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో అవి కూడా ఎండ్ అవుతాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. టాలెంటెడ్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ యాక్టర్ మురళి శర్మ గురించి మనందరికీ తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడమే కాకుండా తనదైన శైలిలో నటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

అయితే అదే తరహాలో ఆయన సతీమణి అశ్విని కల్సేకర్ కూడా నటనలో ఆరితేరినవారు. నిప్పు - బద్రీనాథ్ సినిమాల్లో వెరైటీ రోల్స్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. ఇక చాలా కాలం తరువాత మెహబూబా సినిమాలో అశ్విని మరో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. అది కూడా తన శ్రీవారైనా మురళి శర్మ గారితో కలిసి ఒక భార్య పాత్రలో కనిపించడం స్పెషల్ అని చెప్పాలి. మరి వారిద్దరి పాత్రలు ఎలా ఉంటాయో చూడాలి. ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.
Tags:    

Similar News