మెగా - నందమూరి ఫ్యాన్స్ ని నిరాశపరిచిన మైత్రి

Update: 2019-10-19 01:30 GMT
మైత్రి మూవీమేకర్స్ టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ప్రొడక్షన్ హౌస్లో ఈ  మైత్రి మూవీమేకర్స్ ఒకటి.  మైత్రి మూవీస్ నుండి సినిమా వస్తుంది అంటే కచ్చితంగా బంపర్ హిట్ అనేంతలా పేరుతెచ్చుకున్నారు ఈ ప్రొడక్షన్ హౌస్ వారు. మైత్రి మూవీస్ నుండి వచ్చిన తోలి మూడు చిత్రాలు కూడా టాలీవుడ్ రికార్డ్స్ ని ఊపేసాయి. శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ - రంగస్థలం వంటి బిగెస్ట్ బ్లాక్ బ్లాస్టర్స్ తో టాలీవుడ్ లో మైత్రి మూవీస్ వారు పదిలమైన స్థానం సంపాదించుకున్నారు.

ఇకపోతే ... ఈ మైత్రి మూవీస్ సంస్థకి చెందిన నవీన్..గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్నాం అని ప్రకటించాడు. ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాకి  కెజిఎఫ్  సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నట్టు తెలిపారు. అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనంగా మారింది. కానీ  అది నిజం కాలేదు. దీనితో నందమూరి ఫ్యాన్స్ కొంచెం నిరాశకి లోనైయ్యారు.

అలాగే ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకి గుడ్ బై చెప్పి ..పూర్తిగా తన ఫోకస్ ని మొత్తం రాజకీయాలవైపు పెట్టేసాడు. ఈ సందర్భంలో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ సినిమా ఉండబోతుంది అంటూ తెగ హడావుడి చేసారు. పవన్ మళ్ళీ సినిమాలలో బిజీ కాబోతున్నాడు అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా మైత్రి మూవీ మేకర్స్ అంతా కొత్త వారితో  ఒక చిన్న బడ్జెట్ సినిమా తీయాదానికి సన్నాహాలు మొదలుపెట్టడంతో మెగా ఫ్యాన్స్ - నందమూరి ఫ్యాన్స్ మైత్రి మూవీస్ పై చాలా కోపంగా ఉన్నారు.
Tags:    

Similar News